షాబాద్, మే 18 : శంకర్పల్లిలో డీజే టిల్లు హీరోయిన్ నేహాశెట్టి శనివారం సందడి చేసింది. శంకర్పల్లిలో నగరానికి చెందిన సత్యనారాయణరావు, జాన్బాబు నూతనంగా ఏర్పాటు చేసిన చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే యాదయ్య, ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, నేహాశెట్టి హాజరయ్యారు. స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ముందుగా జ్యోతి ప్రజల్వన కార్యక్రమం చేసిన అనంతరం షాపింగ్మాల్ను నేహాశెట్టి ప్రారంభించారు.
షాపింగ్ మాల్లో ప్రజలు, సిబ్బందితో మాట్లాడారు. హైదరాబాద్కు దగ్గర్లో ఉన్న శంకర్పల్లిలో చందన బ్రదర్స్ లాంటి షాపింగ్మాల్ ఏర్పాటు చేయడం గొప్ప పరిణామమన్నారు. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పేదలకు అనుగుణంగా ధరలు అందుబాటులో ఉంచారని ఆమె తెలిపారు. నిర్వాహకులు సత్యనారాయణరావు, జాన్బాబు మాట్లాడుతూ.. శంకర్పల్లి మండల ప్రజలు హైదరాబాద్కు పోవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే అందుబాటులో ఉండేలా షాపింగ్మాల్ ఏర్పాటు చేశామన్నారు.
ఇప్పటివరకు నగరం చుట్టుపక్కల ఆరు బ్రాంచీలను ప్రారంభించినట్లు తెలిపారు. ప్రజలు సరసమైన ధరలకే షాపింగ్ చేసుకోవచ్చన్నారు. సుమారు 150 మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మొదటి రోజు గొప్ప ఆఫర్ ఇవ్వడంతో షాపింగ్ చేయడానికి ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, వైస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, జడ్పీటీసీ గోవిందమ్మ, మాజీ జడ్పీటీసీ సంధ్యారాణి, నాయకులు, సిబ్బంది ఉన్నారు.