చంపాపేట, డిసెంబర్7: ఎల్బీనగర్ ఎమ్మెల్యేగా మరోసారి గెలుపొందిన దేవిరెడ్డి సుధీర్రెడ్డికి నియోజకవర్గ పరిధిలోని పలు డివిజన్లకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, పలు సామాజిక సంఘాలకు చెందిన వారు శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు.
గురువారం బీఆర్ఎస్ సీనియర్ నేత కర్మన్ఘాట్ హనుమాన్ ఆలయ పాలకమండలి చైర్మన్ నల్ల రఘుమారెడ్డి ఆధ్వర్యంలో చంపాపేట, హస్థినాపురం, లింగోజిగూడ ఇంక పలు డివిజన్లకు చెందిన నాయకులు, కార్యకర్తలు, సామాజిక సంఘాల ప్రతినిధులు ఎమ్మెల్యే సుధీర్రెడ్డిని తన క్యాంపు కార్యాలయంలో కలిసి పూలబొకేలు అందజేసి గజమాలతో సత్కరించి శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.
హయత్నగర్, డిసెంబర్ 7 : ఎమ్మెల్యేగా దేవిరెడ్డి సుధీర్రెడ్డి మూడోసారి గెలుపొందిన సందర్భంగా బీఆర్ఎస్ హయత్నగర్ డివిజన్ కమిటీ అధ్యక్షుడు చెన్నగోని శ్రీధర్గౌడ్ ఆధ్వర్యంలో పలువురు పార్టీ శ్రేణులు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. గురువారం ఎమ్మెల్యే సుధీర్రెడ్డికి క్యాంపు కా ర్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, అభిమానులు అధిక సంఖ్యలో తరలివెళ్లి పుష్పగుచ్ఛాలు అందజేసి శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కుంట్లూరు వెంకటేశ్గౌడ్, హయత్నగర్ డివిజన్ ఉపాధ్యక్షుడు గుజ్జ జగన్మోహన్రెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి, గుడాల సందీప్, శంకర్ నాయక్ పాల్గొన్నారు.
మన్సూరాబాద్, డిసెంబర్ 7: ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డికి కర్మన్ఘాట్ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయ కమిటీ మాజీ చైర్పర్సన్ పోచబోయిన ఈశ్వరమ్మయాదవ్, నాయకులు పోచబోయిన గణేశ్యాదవ్, రమేశ్యాదవ్, మల్లెల శ్రీనివాస్యాదవ్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.