రంగారెడ్డి, ఏప్రిల్ 22(నమస్తే తెలంగాణ): జిల్లాలో రంజాన్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. పట్టణ ప్రాంతాల నుంచి మొదలుకొని గ్రామ స్థాయి వరకు ముస్లింలు వారి వారి స్థానిక ఈద్గాలు, దర్గాలు, మజీదుల్లో పెద్ద ఎత్తున ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో జిల్లా అంతటా ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. ఆలింగనం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మొయినాబాద్ మండలం, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, ఫరూఖ్నగర్, కొత్తూరు, తదితర చోట్ల పెద్ద ఎత్తున వేడుకలు జరిగాయి. మొయినాబాద్, చేవెళ్ల మండల కేంద్రాల్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా ప్రతినిధులు పలుచోట్ల సామూహిక ప్రార్థనలలో పాల్గొన్నారు. జిల్లాలోని పలు మండల కేంద్రాలు, పట్టణాలలోని ఈద్గాల వద్ద పవిత్ర రంజాన్ వేడుక సందర్భంగా ముస్లిం సోదరులను వందలాది మంది హిందువులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రార్థనల అనంతరం ముస్లింలు మతానికి అతీతంగా మిఠాయిలు, షీర్ కుర్మా లాంటి వంటకాలను పంచి పొరుగు వారి నుంచి శుభాకాంక్షలు పొందారు.
షాబాద్ : నియోజకవర్గంలోని చేవెళ్ల, షాబాద్, మొయినాబాద్, శంకర్పల్లి మండలాల పరిధిలోని గ్రామాల్లో రంజాన్ పండుగను పురస్కరించుకుని ఈద్గాల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. చేవెళ్ల, మొయినాబాద్ మండలాల్లో నిర్వహించిన రంజాన్ వేడుకల్లో మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, మాజీ ఎమ్మెల్యే కె.ఎస్ రత్నం, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమంలో డీసీఎంఏస్ చైర్మన్ పట్లోళ్ల కృష్ణారెడ్డి, జడ్పీటీసీలు పట్నం అవినాశ్రెడ్డి, మర్పల్లి మాలతి, కాలె శ్రీకాంత్, గోవిందమ్మ, ఎంపీపీలు మల్గారి విజయలక్ష్మి, కోట్ల ప్రశాంతిరెడ్డి, గునుగుర్తి నక్షత్రం, గోవర్దన్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ సాత విజయలక్ష్మి, బీఆర్ఎస్ ఆయా మండలాల అధ్యక్షులు ప్రభాకర్, నర్సింగ్రావు, మహేందర్రెడ్డి, గోపాల్, వాసుదేవ్కన్నా పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం/ఇబ్రహీంపట్నంరూరల్ : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో శనివారం రంజాన్ పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే ఈద్గాలు, మసీదుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్మెట్ తమండలాలతో పాటు ఇబ్రహీంపట్నం, తుర్కయాంజాల్, ఆదిబట్ల, పెద్దఅంబర్పేట్ మున్సిపాలిటీల్లోని ముస్లింకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మంచాల మండలం ఆరుట్లలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ జానీపాషా ఆధ్వర్యంలో ప్రత్యేక విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన ప్రార్థన కార్యక్రమంలో పలుపార్టీల నాయకులు హాజరై రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
మంచాల : మండలంలోని ఆరుట్ల, మంచాల, చెన్నారెడ్డిగూడ, జాపాల, చాంద్ఖాన్గూడ, కాజ్ఘాట్, ఆగాపల్లి గ్రామాల్లో రంజాన్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుంచే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
యాచారం : భక్తి శ్రద్ధలతో ఈద్గాలు, మసీదులు, దర్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. దీంతో ఆయా ప్రాంతాల్లో సందడి నెలకొంది. హిందువులు ముస్లింలకు రంజాన్ ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలిపారు. కొత్తపల్లి గ్రామంలో చిక్కుడు గుండాలు అనే వ్యక్తి మసీదు నిర్మాణానికి రెండు గదుల స్థలం, రూ.2 లక్షలను అందజేశారు.
పెద్దఅంబర్పేట : ముస్లింలు ఈద్గాలు, మసీదుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. పలుచోట్ల ప్రజాప్రతినిధులు సైతం ప్రార్థనల్లో పాల్గొన్నారు.
అబ్దుల్లాపూర్మెట్ : పవిత్ర భావాలను ఎదనిండ నింపుకొని వేడుకోలు(దువా), ఇతరులు తథాస్తు (అమీన్) అంటూ ఆలింగనాలు చేసుకొని పరస్పర శుభాకాంక్షలు (ఈద్ ముబారక్) తెలుపుకున్నారు. మండలంలోని బాటసింగారం, అనాజ్పూర్, మజీద్పూర్, గండిచెరువు, కవాడిపల్లి, బండరావిరాల తదితర గ్రామాల్లో ముస్లింలు ఈద్-ఉల్- ఫితర్ను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో ఎండీ నసీరుద్దీన్, ఎండీ సలీం, ఎండీ నవాజ్పాష, ఎండీ షఫీయుద్దీన్, అజాం, ఖాదర్, అప్సర్, అక్బర్ తదితరులు ఉన్నారు.
షాద్నగర్టౌన్ : ముస్లింల పవిత్ర, ప్రముఖ పర్వదినమైన రంజాన్ పర్వదినాన్ని ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. షాద్నగర్ మున్సిపాలిటీలోని ఫరూఖ్నగర్ ఈద్గా వద్ద శనివారం వందలాది మంది ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నెల రోజుల పాటు ఉపవాసదీక్షలు చేపట్టి చివరి రోజైన రంజాన్ పర్వదినాన ఈద్-ఉల్-ఫితర్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఏసీపీ కుషాల్కర్ ఆధ్వర్యంలో సీఐ నవీన్కుమార్, పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. ఈద్గా వద్ద ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యేలు ప్రతాప్రెడ్డి, భీష్వ కిష్టయ్య వివిధ పార్టీల నాయకులు ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పర్వదినమన్నారు. అనంతరం ఎమ్మెల్యే ముస్లింలకు రం జాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా ఫరూఖ్నగర్ మండలంలోని పీర్లగూడెం గ్రామంలో మాజీ ఎమ్మె ల్యే చౌలపల్లి ప్రతాప్రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు ప్రతాప్రెడ్డి, నర్సింహులు, సర్వర్పాషా, వెంకట్రాంరెడ్డి, పార్టీల నాయకులు పెంటయ్య, శంకర్, శ్రీనివాస్, ఏజాజ్, నర్సింలు, జమృత్ఖాన్, రావూఫ్, శేఖర్, శ్రీనివాస్, దిలీప్, శ్రీకాంత్, రాజశేఖర్, సంజు, ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.
ఆమనగల్లు : రంజాన్ పండుగ ఆధ్యాత్మికతను పెంపొందిస్తుందని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. ఆమనగల్లు పట్టణంలోని ఈద్గా వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అక్కడకు ఎమ్మెల్యే చేరుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బీఆర్ఎస్ మైనార్టీ సీనియర్ నాయకుడు సయ్యద్ ఖలీల్ నివాసంలో రంజాన్ వేడుకలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ నాలపురం శ్రీనివాస్రెడ్డి, వైస్ ఎంపీపీ జక్కు అనంతరెడ్డి, బీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు అర్జున్రావు, పత్యానాయక్, మైనార్టీ నాయకుడు ఖలీల్, బీఆర్ఎస్ నాయకులు రామకృష్ణ పాల్గొన్నారు.
తలకొండపల్లి : మండల వ్యాప్తంగా రంజాన్ను ముస్లింలు నిర్వహించారు. మండలంలోని చుక్కాపూర్లో ఏఎంసీ చైర్మెన్ శ్రీనివాస్రెడ్డి ప్రభుత్వం అందజేసిన రంజాన్ గిఫ్టులను అందజేశారు. కార్యక్రమంలో రహమాన్, సజ్జుపాషా, అజీమ్, సల్మాన్, సుల్తాన్, జహంగీర్, సయ్యిద్, రావూఫ్ పాల్గొన్నారు.
కడ్తాల్ :రావిచేడ్, మక్తమాదారం, ముద్విన్, సాలార్పూర్, న్యామతాపూర్, చరికొండ, ఏక్వాయిపల్లి గ్రామాల్లో ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్) పండుగను ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రంలో ఉదయం మజీద్ ఇమామ్ జహీరుద్దీన్ ఆధ్వర్యంలో ఈద్గా వద్ద ప్రార్థనలు చేశారు. మండల కేంద్రంలో ముస్లింలను ఎమ్మెల్యే జైపాల్యాదవ్ కలిసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వంశీచంద్రెడ్డి, ఎంపీపీ కమ్లీమోత్యానాయక్, జడ్పీటీసీ దశరథ్నాయక్, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్గుప్తా, సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డి, ఎంపీటీసీ శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.
నందిగామ : మండల కేంద్రంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, సర్పంచ్ వెంకట్రెడ్డి పాల్గొని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. దర్గా, ఈద్గాల వద్ద ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేసి ఖురాన్ ప్రాధాన్యతను వివరించారు. అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ ఈద్ ముబారక్ అంటూ పండుగ శుభాకంక్షలు తెలిపారు.
భక్తిశ్రద్ధలతో ఈద్-ఉల్-ఫితర్
కొత్తూరు : పండుగను పురస్కరించుకొని కొత్తూరు, స్టేషన్ తిమ్మాపూర్, ఇంకా వివిధ గ్రామాల్లో ముస్లింలో మసీదు, దర్గాలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు జరుపుకున్నారు. అలాగే ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దేవేందర్యాదవ్, కొత్తూరు, స్టేషన్ తిమ్మాపూర్ మసీదులకు వెళ్లి పండుగ శుభాకాంక్షలు చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రవీందర్, నాయకులు యాదయ్య, రవినాయక్, శివకుమార్ పాల్గొన్నారు.
కేశంపేట : కొత్తపేటలో ఇటీవల పునర్నిర్మించిన ఈద్గాను, నూతనంగా తవ్వించిన బోరుబావిని ఎంపీపీ రవీందర్యాదవ్ పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. నిర్దవెళ్లి, కొత్తపేట, సంతాపూర్, కేశంపేట తదితర గ్రామాల్లో ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్లు నవీన్కుమార్, ఎంపీటీసీ మల్లేశ్యాదవ్, మండల కోఆప్షన్ మెంబర్ జమాల్ఖాన్, బీఆర్ఎస్ మండల లఅధ్యక్షుడు మురళీధర్రెడ్డి , ముస్లింలు పాల్గొన్నారు.