వికారాబాద్, జూన్ 16 : మున్సిపాలిటీలు దినదినాభివృద్ధిని సాధిస్తున్నాయంటే ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతోనే అని జిల్లా పరిషత్ చైర్పర్సన్ పి.సునీతామహేందర్రెడ్డి తెలిపారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ మంజుల పచ్చ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. వికారాబాద్ పట్టణంలో జరిగిన తెలంగాణ పట్టణ ప్రగతి వారోత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే మెతుకు ఆనంద్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ పి.సునీతామహేందర్రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చొరవ, మంత్రి కేటీఆర్ మార్గనిర్దేశాలతో మున్సిపాలిటీ అభివృద్ధి సాధిస్తున్నదన్నారు. మున్సిపల్లో ఒక్కోవార్డుకు రూ.4నుంచి రూ.5కోట్ల వరకు పనులు జరిగాయన్నారు. నిధులను వృథా చేయకుండా అవసరం ఉన్న దానికి వెచ్చించి ఖర్చు చేసుకోవాలని సూచించారు. మహిళలు విద్య, చిన్న చిన్న వ్యాపారాలను నెలకొల్పుకొని ఆర్థికంగా ఎదుగాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ల దిశా నిర్దేశంతో మున్సిపాలిటీలు, వార్డులు అభివృద్ధి చెందుతున్నాయన్నారు.
ప్రతి రోజు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచే పారిశుద్ధ్య కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ గతంలో పట్టణాలు సమస్యలకు వలయాలుగా ఉండేవన్నారు. ప్రస్తుతం పట్టణ ప్రగతితో వార్డుల్లో ఉన్న చెత్తాచెదారం, శాశ్వత సమస్యలు పరిష్కారం అయ్యాయన్నారు. అనంతరం అధికారులు, సిబ్బందిని ముఖ్యఅతిథులు సన్మానించారు. కార్యక్రమంలో ఆర్డీవో విజయకుమారి, మున్సిపల్ కమిషనర్ శరత్చంద్ర, వెనుకబడిన అభివృద్ధి జిల్లా అధికారి మల్లేశం, డీటీడీవో కోఠాజీ, జిల్లా వ్యవసాయాధికారి గోపాల్, ఎంపీపీ చంద్రకళ, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ శంషాద్బేగం, కౌన్సిలర్లు అనంత్రెడ్డి, గోపాల్, కృష్ణ, చందర్నాయక్, గాయత్రీలక్ష్మణ్, స్వాతిరాజ్కుమార్, అనంతలక్ష్మి, మున్సిపల్ అధికారులు తబిత, వెంకటేశ్, శివకుమార్, సిబ్బంది, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.