మోమిన్పేట, నవంబర్ 9: గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. బుధవారం ‘మీతోనేను’ కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని రాళ్లగుడుపల్లి, గుట్టమీదితండా, ఎల్లమ్మగడ్డతండాల్లో పర్య టించి గ్రామ సమస్యలను ప్రజలతో స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నెలకు మూడు సార్లు వాటర్ ట్యాంక్లను శుభ్రం చేయించాలని మిషన్ భగీరథ అధికారులకు సూచించారు. మిషన్ భగీరథ నీరు ప్రజలందరూ తాగేం దుకు అధికారులు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. పాడుబడ్డ ఇండ్లను, పిచ్చి మొక్కలను తొలగించి పరిసరాల పరిశుభ్రతను పాటించాలన్నారు.
సమస్యలు పునరావృతం అయితే చర్యలు తీసుకుంటామని పంచాయతీ కార్యదర్శిని ఎమ్మెల్యే హెచ్చరించారు. గ్రామాల్లో అవసరమైన చోట విద్యుత్ స్తంభాలు, వీధి దీపాలు ఏర్పాటు చేయాలన్నారు. పంట పొలాలు, ఇండ్లపై వేలాడుతున్న విద్యుత్ తీగలను సరి చేసి విద్యుత్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని విద్యుత్ అధికారులను ఆదేశిం చారు. అనంతరం రూ.22 లక్షలతో నిర్మించిన పంచాయతీ భవనం, పాఠశాల ప్రహరీ , సీసీ రోడ్డును ప్రారంభించారు. అదే విధంగా బూరుగుపల్లి ప్రధాన రోడ్డు నుంచి ఎల్లమ్మగడ్డ తండా వరకు రోడ్డు నిర్మాణానికి రూ.42 లక్షలు మంజూరైనట్లు తెలి పారు. ఎల్లమ్మగడ్డతండా నుంచి గుట్టమీది తండా వరకు రోడ్డు నిర్మాణానికి రూ. కోటి 50 లక్షలు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య, స్థానిక సర్పంచ్ సావిత్రమ్మ గౌడ్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్, మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్గౌడ్, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు హరిశంకర్, ఎంపీటీసీ ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, మండల అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.