కడ్తాల్, జనవరి 8 : పేద ప్రజల ఆరోగ్యానికి తెలంగాణ ప్రభుత్వం భరోసాను కల్పిస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల కేంద్రానికి కాలె చిన్నాకు రూ. లక్ష సీఎం సహాయనిధి చెక్కు మంజూరైంది. ఆ చెక్కును ఆదివారం హైదరాబాద్లోని ఎమ్మెల్యే నివాసంలో లబ్ధిదారుడి కుటుంబ సభ్యుడికి చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, మాజీ జడ్పీటీసీ నర్సింహ, ఎంపీటీసీ శ్రీనివాస్రెడ్డి, బీఆర్ఎస్ కల్వకుర్తి మండల అధ్యక్షుడు విజయ్కుమార్, మాజీ సర్పంచ్ పవన్కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మంచాల : మండలంలోని చెన్నారెడ్డి గూడ గ్రామానికి చెందిన కాలోజు బ్రహ్మచారికి రూ. 30 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. ఎమ్మెల్యే కిషన్రెడ్డి సహకారంతో చెక్కు మంజూరైంది. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి కాట్రోత్ బహదూర్, నాయకులు పరంగ, మావిల్ల వెంకటేశ్, బెల్లి గోపాల్, రమావత్ శంకర్, జరోజా, శ్రీశైలం, అనీల్కుమార్, పిడుగు జంగయ్య, గ్యార జంగయ్య, వంగలి సందీప్, కిషన్ తదితరులు పాల్గొన్నారు.
పెద్దఅంబర్పేట : ఆపద సమయాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు అండగా నిలుస్తున్నదని బీఆర్ఎస్ మున్సిపాలిటీ మహిళా అధ్యక్షురాలు చెరుకూరి రేణుకా జగన్ అన్నారు. మున్సిపాలిటీ పరిధి 5వ వార్డులో ఎంగరిగల్ల కృష్ణ కుమారుడు అనారోగ్యంతో దవాఖానలో చేరాడు. చికిత్స కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేశారు. విషయాన్ని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, కృష్ణ కుటుంబానికి సీఎంఆర్ఎఫ్ నుంచి రూ.43 వేలు మంజూరుచేయించినట్టు రేణుక తెలిపారు. ఆదివారం బాధిత కుటుంబ సభ్యులకు చెక్కును అందజేశారు.