షాబాద్, జనవరి 9 : తెలంగాణలో క్రీడా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. సోమవారం మండల పరిధిలోని కక్కులూర్ గ్రామంలో నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండలస్థాయి క్రీడా పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆటలో గెలుపోటములు సమానంగా స్వీకరించి లక్ష్యం దిశగా ముందుకు సాగాలని సూచించారు. క్రీడలు శరీర దారుఢ్యంతోపాటు మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడుతాయని తెలిపారు.
క్రీడా పోటీల నిర్వహణతో గ్రామాల మధ్య స్నేహసంబంధాలు పెంపొందుతాయని స్పష్టం చేశారు. మండలస్థాయి నుంచి జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి క్రీడల్లో రాణించాలని యువతకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రశాంతిరెడ్డి, ఎంపీడీవో అనురాధ, సర్పంచులు మమతారెడ్డి, జంగయ్య, రైతు బంధు సమితి మండల కన్వీనర్ మధుసూదన్రెడ్డి, మాజీ ఎంపీటీసీ జీవన్రెడ్డి, నెహ్రూ యువ కేంద్రం జిల్లా కో-ఆర్డినేటర్ ఐజయ్య, మండల కో-ఆర్డినేటర్ మహేశ్ పాల్గొన్నారు.
క్రీడలతో మానసిక ఉల్లాసం
చేవెళ్ల రూరల్ : క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని చేవెళ్ల సీఐ వెంకటేశ్వర్లు అన్నారు. స్వామి వివేకానంద జయంతి (యువజన దినోత్సవం) సందర్భంగా వివేకానంద డిగ్రీ, జూనియర్ కళాశాలలో విద్యార్థులకు క్రీడా పోటీలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఐ హాజరై క్రీడా పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ జైపాల్రెడ్డి, డైరెక్టర్ ఇంద్రసేనారెడ్డి, అధ్యాపకులున్నారు.
ఘనంగా మైసమ్మ జాతర
మండల పరిధిలోని రేగడిఘనాపూర్ గ్రామంలో ఆదివారం, సోమవారం మైసమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సోమవారం ఎమ్మెల్యే కాలె యాదయ్య ముగింపు ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరై పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామస్తులు ఎమ్మెల్యేను సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ నర్సింహులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కృష్ణారెడ్డి, మండలాధ్యక్షుడు ప్రభాకర్, సర్పంచ్ల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ గిరిధర్రెడ్డి, సివిల్ సైప్లె జిల్లా సభ్యుడు రవీందర్ పాల్గొన్నారు.
ఈర్లపల్లిలో మల్లన్న జాతర
చేవెళ్ల మండల పరిధి ఈర్లపల్లి గ్రామంలో మల్లన్న జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ రాజశేఖర్, నాయకులు పాల్గొన్నారు.