ఇబ్రహీంపట్నంరూరల్, జనవరి 10 : ఇబ్రహీంపట్నం సమీపంలో నిర్మాణంలో ఉన్న డిగ్రీ కళాశాల భవనాన్ని త్వరలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి కృషిచేస్తామని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యా జాయింట్ డైరెక్టర్ యాదగిరి అన్నారు. బుధవారం ఇబ్రహీంపట్నంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
కళాశాలలో వసతులను పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని తెలిపారు. అనంతరం ఇబ్రహీంపట్నం సమీపంలోని వినోభానగర్లో కొనసాగుతున్న నూతన డిగ్రీ కళాశాల భవన నిర్మాణ పనులను పరిశీలించారు. వీలైనంత తొందరగా భవనాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సహకరించాలని ఇంజనీర్తో పాటు కాంట్రాక్టర్తో మాట్లాడారు.
అవసరమైతే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి నూతన భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేసేందుకు కృషిచేస్తానని తెలిపారు. అనంతరం డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రభు ఆధ్వర్యంలో ఆయనను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం పాల్గొన్నారు.