తలకొండపల్లి : మండల పరిధిలోని జంగారెడ్డిపల్లి గ్రామంలో గల ప్రాథమికొన్నత పాఠశాల భవణం శిథిలావస్థకు చేరడంతో గ్రామ సర్పంచ్ వరలక్ష్మీరాజేందర్రెడ్డి ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న దృష్టికి తీసుకెల్లారు. గతంలో పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్సీ గోరేటి భవన నిర్మాణానికి తన నిధుల నుంచి మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. నేడు తలకొండపల్లి మండలానికి వచ్చిన గోరేటి వెంకన్న గ్రామ సర్పంచ్ భర్త టీఆర్ఎస్ మండల సోషల్మీడియా కన్వీనర్ రాజేందర్రెడ్డికి పాఠశాల భవన నిర్మాణం కోసం రూ. 22లక్షల ప్రోసిడింగ్ను అందజేశారు.
కార్యక్రమంలో సర్పంచ్లు శ్యాంసుదర్రెడ్డి, జ్యోతయ్య, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు హరిమోహన్రెడ్డి, యాదగిరి, మల్లేశ్ పాల్గొన్నారు.