షాద్నగర్ : అక్రమంగా తరలిస్తున్న 50 కిలోల గంజాయిని షాద్నగర్ పోలీసులు మంగళవారం రాత్రి షాద్నగర్ పట్టణ శివారులోని చటాన్పల్లి బైపాస్ వద్ద పట్టుకున్నారు. కర్నూల్ జిల్లా నంద్యాలకు చెందిన కుమ్మర చిన్నఎల్లయ్య, గడ్డ నర్సింహారావు, కుమ్మర నవీన్ అనే ముగ్గురు వ్యక్తులు సుమారు 50 కిలోల గంజాయిని కారులో నంద్యాల నుంచి హైదరాబాద్కు తరలిస్తుండగా పట్టుకున్నామని ఏసీపీ కుశల్కర్ తెలిపారు. అక్రమంగా గంజాయిని రవాణ చేస్తే శాఖపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నింధితులపై కేసు నమోదు చేసి జైలుకు తరలించినట్లు తెలిపారు.