డప్పు చప్పుళ్లు.. నృత్యాల హోరు.. మంగళ వాయిద్యాలు.. గణపతి బొప్పా మోరియా అంటూ..భకుల జోరుతో వికారాబాద్ జిల్లాలోని కొడంగల్, పరిగి, పూడూరు, ధారూరు, మర్పల్లి తది తర ప్రాంతాలు హొరెత్తాయి. జనాలు భక్తి పరశంలో మునిగిపో యారు. శోభాయాత్ర సందర్భంగా ఉదయం నుంచి పండుగ వాతావరణం నెలకొంది. చిన్న, పెద్ద నిమజ్జనానికి తిలకించేం దుకు తరలివచ్చారు. గణనాథుడు అమ్మ ఒడిలోకి వెళ్తున్న వైనాన్ని కళ్లారా వీక్షించారు. ఉదయం నుంచే వినాయకులు కదలడంతో శోభాయాత్ర ప్రారంభమైంది. మిగతా అన్ని ప్రాంతాల్లోని వినాయకులు వచ్చి చేరడంతో యాత్ర సందడిగా మారింది. అత్యధిక విగ్రహాలను సమీపంలోని చెరువుల వద్దకు నిమజ్జనా నికి తరలించడంతో భక్త జన సందోహమైంది. పలు ప్రాంతాల్లో వినాయకుల లడ్డూలకు వేలం పాట నిర్వహించారు. పోటా పోటీగా వేలం పాడి లడ్డూలను దక్కించుకున్నారు.
– వికారాబాద్ న్యూస్ నెట్వర్క్, సెప్టెంబర్ 28