నందిగామ/చేవెళ్ల రూరల్, సెప్టెంబర్ 20 : ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గణపతి నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పలు గ్రామాల్లో కుల, మత, పార్టీలకు అతీతంగా ఊరంతటికీ ఒకే గణేశ్ను ప్రతిష్ఠించుకుని ప్రత్యేక పూజలు చేస్తూ ఐక్యతను చాటుకుంటున్నారు.
నందిగామ మండలంలోని అప్పారెడ్డిగూడ, జంగోనిగూడ గ్రామాల్లో పూర్వం నుంచి ఒకే వినాయక విగ్రహం ఏర్పాటు చేసుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. చేవెళ్ల మండల పరిధిలోని నాన్చేరు గ్రామంలో దాదాపు 18 ఏండ్లుగా ఒకే విగ్రహాన్ని ప్రతిష్టించి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నారు.