బొంరాస్పేట, మే 23 : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మన ఊరు-మనబడి పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయగా కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేసి ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనకు నిధులు మంజూరు చేస్తున్నది.
వచ్చే నెల 12వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కావలసిన వసతి సౌకర్యాలు సమకూర్చాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందులో భాగంగా ప్రతి పాఠశాలకు మహిళా సంఘాల సభ్యులతో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేసి నిధులను మంజూరు చేసింది. బొంరాస్పేట మండలంలోని పాఠశాలల అభివృద్ధికి రూ.2.16 కోట్లు, దుద్యాల మండలానికి 1.55 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది.
మంజూరు చేసిన నిధులను విడుతల వారీగా విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం అన్ని పాఠశాలలకు 25 శాతం చొప్పున నిధులు విడుదల చేసింది. పాఠశాలల్లో మౌలిక వసతులైన తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ వంటి వాటికి మొదటి ప్రాధాన్యం ఇచ్చి పనులు కొనసాగిస్తున్నారు. వచ్చేది వర్షాకాలం కాబట్టి ఎక్కడా లీకేజీలు ఉండకుండా మరమ్మతులు చేపడుతున్నారు. వేసవి సెలవులైనా హెచ్ఎంలను పాఠశాలలకు రమ్మని పనులను ప్రారంభించి వేగవంతం చేస్తున్నారు. జిల్లా, మండల స్థాయి అధికారులు కూడా పనుల పురోగతిని పర్యవేక్షిస్తూ పనుల్లో వేగం పెంచుతున్నా రు. జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి మంగళవారం మండలంలో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు.
పనులు చురుకుగా జరుగుతున్నాయి
బొంరాస్పేట, దుద్యాల మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు చురుకుగా జరుగుతున్నాయి. పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లకు మొదటి ప్రాధాన్యం ఇచ్చి పనులు చేయి స్తున్నాం. తాగునీరు, మరుగుదొడ్లు లేక విద్యార్థులు ఇబ్బం దులు పడేవారు. పాఠశాలల పునఃప్రారంభం నాటికి ఆహ్లాదకరమైన వాతావ రణంలో అన్ని వసతులను కల్పించ డానికి కృషి చేస్తున్నాం. నిధులను సద్వినియోగం చేసుకుని పాఠశాల లను అభివృద్ధి చేసుకోవడానికి ఇది మంచి అవకాశం.
-కల్వకోటి రాంరెడ్డి, ఎంఈవో బొంరాస్పేట