బషీరాబాద్, ఫిబ్రవరి 14 : సీఎం కేసీఆర్ ప్రభు త్వం రైతులు పండించిన ప్రతి గింజకూ మద్దతు ధర దక్కాలని.. దళారుల చేతుల్లో అన్నదాత మోసపోవద్దని రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి.. ప్రతి గింజకూ మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తుంటే.. నంవాద్గి సొసైటీ సీఈవో మాత్రం కూలీలతో చేతులు కలిపి తూకంలో మోసానికి తెర లేపాడు. రైతులు సకాలంలో గుర్తించడంతో సీఈవో, కూలీల బండారం బయటపడింది. నవాం ద్గి సొసైటీ ఆధ్వర్యంలో శనగల కొనుగోలు కేంద్రా న్ని ఐదురోజుల క్రితం ఎంపీపీ కరుణాఅజయ్ప్రసాద్ చేతుల మీదుగా ఏర్పాటు చేశారు. రూ. 5,3 35 మద్దతు ధర ఇవ్వాలని నిర్ణయించారు.
శనగల ను తూకం వేసేందుకు బీహార్ కూలీలను నియమించుకున్నారు. కాగా సోమవారం కొంతమంది రైతు లు తమ శనగలను కొనుగోలు కేంద్రానికి తీసుకురాగా.. వాటిని తూకం వేసే సమయంలో కూలీలు కాలు పెట్టి తక్కువ తూకం (50 కిలోలు) వచ్చేలా రైతులకు చూపించారు. కాగా పలువురు రైతులు నిబంధనల ప్రకారమే తూకం వేశారని భావించి వారి ఇండ్లకు వెళ్లిపోయారు. అయితే పర్వత్పల్లి గ్రా మానికి చెందిన ఓ రైతు ఇంటికి వెళ్లకుండా అక్కడే ఉన్నాడు. రాత్రి కాగానే ఉదయం తూకం వేసిన రైతుల బస్తాల నుంచి కూలీలు శనగలను తీయడాన్ని అతడు గమనించి మంగళవారం ఉదయం తోటి రైతులకు చెప్పాడు.
దీంతో రైతులు ఉదయం తూకం వేసిన బస్తాలను మళ్లీ తూకం వేయగా ఒక్కో బస్తాకు 2 నుంచి 9 కిలోల వరకు తేడా రావడంతో మండిపడ్డారు. విషయం తెలుసుకున్న చైర్మన్ వెంకట్రాంరెడ్డి సొసైటీకి వచ్చి ఆరా తీశారు. అప్పటికే ముగ్గురు కూలీలు పారిపోగా మిగిలిన ఇద్దరిని రైతులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఎందుకు ఈ పని చేశారని కూలీలను చైర్మన్ ప్రశ్నించగా సీఈవో ఆదేశాల మేరకు చేసినట్లు వారు చెప్పా రు. ఈ సందర్భంగా చైర్మన్ వెంకట్రాంరెడ్డి ఘటనపై విచారం వ్యక్తం చేశారు. రైతులకు అన్యాయం జరుగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ఆయన పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
నవాంద్గి సొసైటీ సీఈవోపై కేసు నమోదు
శనగల తూకంలో అవకతవకలకు పాల్పడినట్లు నవాంద్గి సొసైటీ చైర్మన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సొసైటీ సీఈవో, మరో ఇద్దరు కూలీలపై కేసు నమో దు చేసినట్లు బషీరాబాద్ ఎస్ఐ విద్యాచరణ్రెడ్డి మంగళవారం తెలిపారు. నవాంద్గి ప్రాథమిక వ్యవసాయ సంఘంలో సీఈవోగా విధులు నిర్వహిస్తున్న వెంకటయ్య, బీహార్ కూలీలు దీపక్కుమార్, రవీందర్ బిందాతో కలిసి పర్వత్పల్లి, నవల్గా గ్రామాలకు చెందిన రైతుల శనగల బస్తాల తూకంలో అవకతవకలను పాల్పడి, రైతులను మోసగించారని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.