తాండూరు, ఏప్రిల్ 19: పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపునకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని తాండూ రు మాజీ ఎమ్మెల్యే పి.రోహిత్రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరులో నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య నేతల సమావేశంలో రోహిత్రెడ్డి మాట్లాడుతూ.. 96 కులాల బీసీ ఐక్య వేదికను ఏర్పాటు చేసి అందరిని ఒక్కతాటికి తీసుకొచ్చిన చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ను అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు అం దరం కలిసి కట్టుగా పనిచేయాలని కోరారు.
పదేండ్లు బీఆర్ఎస్ పాలనలో మనం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాలన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేండ్ల నుంచి పార్లమెంట్ ఎన్నికల్లో రెండు సార్లు చేవెళ్ల పార్లమెంట్లో బీఆర్ఎస్ ఘన విజ యం సాధించిందన్నారు. ప్రస్తుతం జరిగే ఎన్నికల్లో కూడ బీఆర్ఎస్ గెలుస్తుందన్నారు.
తప్పుడు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రజలను నట్టేట ముంచుతుందని రోహిత్రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రె స్ ఒక్కటై ప్రజలను మోసం చేస్తుందని తెలిపారు. నాటి నుంచి నేటి వరకు బీజేపీ, కాంగ్రెస్తో తాండూరుకు ఒరిగిందేమిలేదన్నారు. ఉద్యమ నాయకుడు కేసీఆర్ ఆధ్వర్యంలో ఉన్నత పదవులు అనుభవించిన నాయకులు నేడు పార్టీలు మార డం విడ్డూరంగా ఉందన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలతో చేతులు కలిపి బీఆర్ఎస్ ఓటమికి కారణమైన వ్యక్తులను ఎన్నటికీ ఎక్కడ గెలవనివ్వమని హెచ్చరించారు. ప్రస్తుతం జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను మోసం చేసిన ద్రోహులను చిత్తు చిత్తుగా ఓడిస్తామన్నారు. బీసీ వర్గానికి చెందిన మంచి మనసున్న కాసాని జ్ఞానేశ్వర్కు తాండూరు నియోజక వర్గం భారీ మెజార్టీ తీసుకొస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బైండ్ల విజయ్కుమార్, బీఆర్ఎస్ నేతలు శ్రీశైల్రెడ్డి, రాజుగౌడ్, నర్సిరెడ్డి, శకుంతల, వీరేందర్రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.