ఆమనగల్లు, ఫిబ్రవరి 12 : కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం నల్లగొండలో నిర్వహించనున్న బహిరంగ సభకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలిరావాలని పార్టీ నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పిలుపునిచ్చారు. ఆమనగల్లు పట్టణంలో సోమవారం జడ్పీటీసీ నేనావత్ అనురాధ, స్థానిక నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చలో నల్లగొండ బహిరంగ సభ వాల్పోస్టర్ను విడుదల చేశారు.
అనంతరం గువ్వల బాలరాజు మాట్లాడుతూ.. కృష్ణాజలాల సాధ న కోసం బీఆర్ఎస్ పార్టీ పట్టుదలగా ఉన్నదని, చలో నల్లగొండ సభకు అధినేత కేసీఆర్ హాజరై కృష్ణా ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ఎండగట్టనున్నారన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు పత్యానాయక్, కార్యనిర్వాహక అధ్యక్షుడు నిరంజన్ గౌడ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు లాలయ్య గౌడ్, సురేందర్ రెడ్డి, శ్రీనూనాయక్, పంతూనాయక్, రమేశ్, వెంకటేశ్, రమేశ్నాయక్, యాదయ్య, జగన్, రమేశ్నాయక్, గణేశ్నాయక్, అంజీయాదవ్ ఉన్నారు.
ఇబ్రహీంపట్నంరూరల్ : సాగునీటి ప్రాజెక్టుల ను కేంద్రానికి అప్పగించకుండా అడ్డుకోవడా నికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నెల 13న నల్లగొండలో నిర్వహించతలపెట్టిన బహిరంగ సభకు పార్టీ శ్రేణులు భారీగా తరలిరావాలని పార్టీ ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షుడు చిలుకల బుగ్గరాములు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సభకు మండలం లోని బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవం తం చేయాలని కోరారు.
మంచాల : బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న నల్లగొండ బహిరంగసభను విజయవంతం చేయాల్సిన బాధ్యత బీఆర్ఎస్ కార్యకర్తలపై ఉందని ఆ పార్టీ మండల అధ్యక్షుడు చీరాల రమేశ్ అన్నారు. సోమవారం మంచాలలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్వహిస్తున్న బహిరంగసభను విజయవంతం చేసేందుకు మండలంలోని నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.