ధారూరు, జనవరి 6 : పార్లమెంటు ఎన్నికల్లో చేవెళ్ల ఎంపీగా డాక్టర్ గడ్డం రంజిత్రెడ్డిని భారీ మెజార్టీతో గెలుపించుకుందామని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. శనివారం ధారూరు మండల పరిధి నాగుసాన్పల్లి, తరిగోపుల గ్రామాల్లో ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ.. గత నెలలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఓడినందుకు నిరాశ చెందొద్దన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీగా రంజిత్ అన్నను భారీ మెజార్టీతో గెలిపించుకుందామని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ధారూరు మండల అధ్యక్షుడు రాజూనాయక్, మండల మాజీ అధ్యక్షుడు వేణుగోపాల్రెడ్డి, నాయకులు వెంకటయ్య, దేవేందర్, వెంకట్రామ్రెడ్డి, రవికుమార్, యాదయ్య, శ్రీనివాస్, వెంకటయ్య, యాదయ్యయాదవ్ ఉన్నారు