షాబాద్, జనవరి 18: కంటి వెలుగు కార్యక్రమం పేదల కండ్లలో వెలుగులు నింపుతున్నది. ఇప్పటికే చేపట్టిన మొదటి విడుత కార్యక్రమం సక్సెస్ కాగా.. నేటి నుంచి రెండో విడుత రంగారెడ్డి జిల్లాలో ప్రారంభం కానున్నది. ఈ సందర్భంగా వైద్యారోగ్యశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కలెక్టర్ మార్గదర్శకత్వంలో జిల్లాలో 80 ప్రత్యేక బృం దాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు వంద రోజులపాటు జిల్లాలోని అన్ని గ్రామా లు, మున్సిపాలిటీల్లో 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులతోపాటు అద్దాలను పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం జిల్లాకు 99,382 కంటి అద్దాలు చేరాయి. కంటి వెలుగు ఆహ్వాన పత్రాలను గ్రామాలు, మున్సిపాలిటీల్లో ప్రజాప్రతినిధులతోపాటు ప్రజలకు ఇప్పటికే వైద్యసిబ్బంది అందజేశారు. గురువారం ఉదయం మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేటలో విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అదేవిధంగా జిల్లాలోని ఆయా నియోజకవర్గాలు, మండలాల్లో జరిగే కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, పాల్గొని ప్రారంభించనున్నారు.
కేంద్రాలకు చేరిన ఫర్నిచర్, సామగ్రి
రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలోని 37 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని 558 గ్రామ పంచాయతీలు, 23 జీహెచ్ ఎంసీ వార్డులు, 358 మున్సిపల్ ప్రాంతాల్లో కంటి వెలుగు కార్యక్రమ శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు అవసరమైన సామ గ్రి, ఫర్నిచర్ ఇప్పటికే అన్ని కేంద్రాలకు చేరింది.
కలెక్టర్ అమయ్కుమార్ కంటి వెలుగుపై రోజువారీ కార్యక్రమ ఏర్పాట్లు, మెటీరియల్ సరఫ రా, రవాణా తదితర అంశాలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో 80 బృందాలను ఏర్పాటు చేయగా.. ప్రతిరోజూ గ్రామీణ ప్రాం తాల్లో 300 మందికి, పట్టణ ప్రాంతాల్లో 350 మందికి కంటి పరీక్షలు చేయనున్నారు. క్యాం పునకు వచ్చే వారు తమ ఆధార్కార్డు, ఫోన్నంబర్ తమ వెంట తీసుకురావాలని అధికారులు సూచిస్తున్నారు.
ఏర్పాట్లు పూర్తి..
నేటి నుంచి ప్రారంభం కానున్న రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమ నిర్వహణకు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. డీఎంహెచ్వో కార్యాలయంలో ఒక కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. అక్క డి నుంచి జిల్లాలోని అన్ని కంటి వెలుగు క్యాం పుల్లోని బృందాలను ఆన్లైన్ ద్వారా పర్యవేక్షించనున్నారు. బుధవారం జిల్లాలోని అన్ని కేం ద్రాల్లో ట్రయల్ రన్ నిర్వహించి, క్యాంపుల పని విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. ‘కంటి వెలుగు’ విజయవంతానికి ఆరుగురు అధికారులను కలెక్టర్ అమయ్కుమార్ నియమించారు. అదే విధంగా ఐదుగురు డివిజన్ డిప్యూటీ డీఎంహెచ్వోలను కూడా పర్యవేక్షణాధికారులుగా ఏర్పాటు చేశారు.
సద్వినియోగం చేసుకోవాలి
నేటి నుంచి ప్రారంభం కానున్న రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. ప్రజలకు కంటి పరీక్షలు చేసేందుకు రంగారెడ్డి జిల్లాలో 80 బృందాలను ఏర్పా టు చేశాం. అవసరమున్న వారికి కంటి అద్దాలు, మందులను ఉచితంగా పంపిణీ చేస్తాం.
–వెంకటేశ్వరరావు, రంగారెడ్డి డీఎంహెచ్వో