ఇబ్రహీంపట్నం, నవంబర్ 28 : మత్స్యకారులు ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలతో ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం పెద్దచెరువుకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసిన 8.83 లక్షల చేపపిల్లలను సోమవారం ప్రజాప్రతినిధులు, మత్స్యకారులతో కలిసి ఆయన చెరువులో వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలనలో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయని, చెరువులు, కుంటలు నిండుకుండల్లా మారాయని ఆనందం ద్యక్తం చేశారు. చేపల వృత్తిపై ఆధారపడిన ముదిరాజులు, మత్స్యకారులు, గంగపుత్రుల కుటుంబాలకు ఉచితంగా చేపపిల్లలు పంపిణీ చేయటడం ద్వారా వారి కుటుంబాలు ఆర్థికంగా ఎదిగేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
గతంలో చేపపిల్లల కోసం సముద్రతీర ప్రాంతాలకు వెళ్లే వారని, డబ్బులు పెట్టి చేపపిల్లలు కొనుక్కునే పరిస్థితి ఉండేదని ఎమ్మెల్యే గుర్తుచేశారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని అన్ని చెరువుల్లో ఈ ఏడాది లక్షల చేపలు ఉచితంగా పంపిణీ చేసే విధంగా చర్యలు చేపట్టాలని మత్స్యశాఖ అదికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా ఫిషరిష్ అధికారి సుకీర్తి, ఎంపీపీ కృపేశ్, మున్సిపల్ చైర్మన్ స్రవంతి, వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తువెంకటరమనారెడ్డి, కౌన్సిలర్లు, మమత, ప్రసన్న, శ్వేత, బాలరాజు, సుజాత, మత్స్యకార సొసైటీ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.