పరిగి : కరోనా కట్టడిలో భాగంగా ఇంటింటి జ్వర సర్వే కొనసాగుతుంది. బుధవారం వికారాబాద్ జిల్లా పరిధిలో 620 ప్రత్యేక బృందాలు ఇంటింటి జ్వర సర్వే నిర్వహించాయి. ఈ సందర్భంగా ఒక్కరోజు 21,239 కుటుంబాల సర్వే చేపట్టారు. జిల్లాలో 22,0386 కుటుంబాలుండగా ఇప్పటి వరకు 183047 కుటుంబాల సర్వేను పూర్తి చేయడం జరిగింది. జిల్లా పరిధిలోని బంట్వారం, చన్గోముల్, దౌల్తాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఇంటింటి జ్వర సర్వే పూర్తయింది. మిగతా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో రాబోయే రెండుమూడు రోజుల్లో జిల్లాలో జ్వర సర్వే పూర్తి కానుంది. సర్వేలో భాగంగా జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉన్నాయా అని అడిగి తెలుసుకోవడంతో పాటు ఈ లక్షణాలు ఉన్న వారికి వైద్య సిబ్బంది మందులు పంపిణీ చేశారు.
తీవ్రమైన లక్షణాలు ఉంటే మందులు అందజేయడంతో పాటు వారి ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికపుడు అడిగి తెలుసుకున్నారు. మరోవైపు అర్హులందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సైతం సూచించారు. 15 నుంచి 17ఏళ్ల లోపు వారు మొదటి, 18 ఏళ్లు పైబడిన వారు రెండో డోసు, 60 ఏళ్లు పైబడిన వారు ప్రికాషనరీ డోసు తీసుకోవాల్సిందిగా పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లాలో బుధవారం 15నుంచి 17 ఏళ్ల లోపు వారు 129మందికి మొదటి డోసు, 18 ఏళ్లు పైబడిన వారిలో మొదటి డోసు 115మందికి, రెండో డోసు 3318 మందికి, ప్రికాషనరీ డోసు టీకా 9మందికి ఇవ్వడం జరిగింది.