వికారాబాద్, ఫిబ్రవరి 4 : వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని అనంతగిరిపల్లిలో పండుగ వాతావరణం నెలకొంది. ఆదివారం నూతన బొడ్రాయి ప్రతిష్ఠాపన వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమం స్థానిక కౌన్సిలర్లు దేవీరెడ్యానాయక్, జైదుపల్లి మురళి ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం స్పీకర్ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో భాగంగా కాలనీ వాసులు, ఒగ్గు కళాకారులు నృత్యాలు చేశారు. కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ ఉత్సవాలను మూడు రోజుల పాటు జరుపుకోనున్నారు. వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజులారమేశ్ దంపతులు హాజరై పూజలు చేశారు. గ్రామంలో ఉత్సవాలు నిర్వహిస్తుండడంతో ఊరంతా పండుగ వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేశ్కుమార్, మాజీ కౌన్సిలర్ రాములమ్మ, కాలనీ పెద్దలు అనంతయ్య, బాగయ్య, రాజునాయక్, రెడ్డి శేఖర్, నర్సింహులు కాలనీ వాసులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.