తలకొండపల్లి : కత్తెర పురుగు నివారణకు రైతులు జాగ్రత్తలు పాటించాలని మండల వ్యవసాయ అధికారి రాజు అన్నారు. బుధవారం మండల పరిధిలోని గట్టు ఇప్పలపల్లిలోని రైతుల పొలల్లో కంది, మొక్కజొన్న, పత్తి పంటలను పరిశీలించారు. ఎడతెరిపులేని వర్షాల కారణంగా కంది, మొక్కజొన్న పంటల ఆకులు ఎర్రగా మారాయని రెండుమూడు రోజులు ఎండలుకాస్తే బాగవుతాయని అన్నారు. మొక్కజొన్నలో కత్తెరపురుగు తయారయ్యిందని వాటి నివారణకు కార్బోపోరన్ 3గ్రాముల గ్రానులెస్ ఎకరాకు ఎనిమిది కిలోలు వేసుకోవాలని సూచించారు. రైతులు యజమాన్య పద్దతులు పాటిస్తే అధిక దిగుబడులు సాదిస్తారని తెలిపారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ శ్రీనివాస్రెడ్డి, ఏఈఓ శివుడు, రైతులు పాల్గొన్నారు.