ఇబ్రహీంపట్నం రూరల్, నవంబర్ 30: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు గ్రామ పంచాయతీల్లోని 14, 15వ ఆర్థిక సంఘం నిధు ల నుంచి వినియోగించుకునేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిందని ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేశ్ అన్నా రు. మంగళవారం ఆయన ఇబ్రహీంప ట్నం మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులైన తాగునీరు, పాఠశాల భవనాలకు మరమ్మతులు, మూత్రశాలలు, మరుగుదొడ్లు, కిచెన్షె డ్లు, దివ్యాంగుల సౌకర్యార్థం ర్యాంపులు, పాఠశాల గేట్లు తదితర వాటికి ఈ నిధులను వినియో గించుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇవ్వడంతో ఎప్పటికప్పుడు పాఠశాలల్లో వసతుల కల్పనకు సర్పంచ్లు, ఎంపీటీసీలు కృషిచేయాలన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా సర్కారు బడులను తీర్చిదిద్దాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో మహేశ్బాబు, ఎంపీవో సురేశ్, ఎం ఈవో వెంకట్రెడ్డి, పంచాయతీరాజ్ ఏఈ ఇంద్రసేనారెడ్డి, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయు లు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.