షాద్నగర్ రూరల్/కేశంపేట, జనవరి 27: కంటి వెలుగు కార్యక్రమంతో కంటి సమస్యలు దూరమవుతాయని డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ జయలక్ష్మి అన్నారు. శుక్రవారం ఆమె ఫరూఖ్నగర్ మండలంలోని రాయికల్ గ్రామంలో కొనసాగుతున్న కంటి వెలుగు క్యాంపును పరిశీలించి మాట్లాడారు. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ తప్పకుండా కంటి వెలుగు క్యాంపులో పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంపై ఇంటింటికెళ్లి అవగాహన కల్పించాలని ఆమె సిబ్బందికి సూచించారు. కంటి సమ స్య ఎక్కువగా ఉండి ఆపరేషన్ అవసరమైన వారిని సరోజనీదేవి దవాఖానకు రెఫర్ చేయాలని వైద్యులకు సూచించారు.
అదేవిధంగా ఆమె కేశంపే ట మండలంలోని సంగెం గ్రామంలోని కంటి వెలుగు శిబిరాన్ని కూడా పరిశీలించారు. కాగా వైద్యులు కేశంపేటలో 112 మందికి, సంగెంలో 116 మందికి పరీక్షలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో డాక్టర్లు స్రవంతి, రమాదేవి, నిఖిత, కార్త్తిక్, ఆనంనజ్మా, హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాసులు, ఎంపీహెచ్వో ఆంజనేయులు, నరహరి, ఉపేందర్రెడ్డి, సిబ్బంది పుష్ప, సుందరి, ఏఎన్ఎంలు వీణ, పార్వతి, సుజాత, సంతోష, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.