షాద్నగర్రూరల్, ఫిబ్రవరి 23 : గ్రామీణ ప్రాంతాలకు గ్రంథాలయ సేవలను విస్తరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి అన్నారు. షాద్నగర్ మున్సిపాలిటీలో ఆధునిక హంగులతో నూతనంగా నిర్మిస్తున్న గ్రంథలయ నిర్మాణ పనులను గురువారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పౌర పఠన కేంద్రాల ఏర్పాటుకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, దీంతో ప్రతి మండలంలోని రెండు గ్రామాల్లో నూతన గ్రంథాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ సూచనల మేరకు నియోజకవర్గంలో మొదట విడుతగా నూతనంగా 6 గ్రంథాలయాల ఏర్పాటుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. గ్రంథాలయాలు జ్ఞాన వృక్షాలని.. ప్రతిఒక్కరూ గ్రంథాలయాలకు వచ్చి పుస్తక పఠనంతో తమ జ్ఞానాన్ని మరింత పెంచుకోవాలన్నారు.
ఎంతో మంది నిరుద్యోగులు గ్రంథాలయాల్లో అందుబాటులో ఉంచిన స్టడీ మెటీరియల్తో ఉద్యోగాలు సాధించినట్లు తెలిపారు. షాద్నగర్లో నూతనంగా నిర్మిస్తున్న గ్రంథాలయం త్వరలోనే ఆందుబాటులోకి రానుండడం సంతోషంగా ఉందన్నారు. కొందుర్గు మండల లైబ్రరీకి 700 గజాల స్థలం దానం ఇచ్చిన శ్రీనివాస్గుప్తాను ప్రత్యేకంగా అభినందించారు. గ్రంథాలయాల అభివృద్ధికి ప్రతిఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ కార్యదర్శి మనోజ్కుమార్, షాద్నగర్ గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ లక్ష్మీనర్సింహారెడ్డి పాల్గొన్నారు.