ధారూరు, జనవరి 1 : మండల పరిధిలోని కోట్పల్లి ప్రాజెక్టులో ఆదివారం, నూతన సంవత్సరం మొదటి రోజు కావడంతో పర్యాటకులు పెద్దఎత్తున తరలివచ్చారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు దినం కావడంతో ప్రాజెక్టులో సందడి చేశారు. ప్రాజెక్టు నీటిలో ఉత్సాహంగా.. ఉల్లాసంగా బోటింగ్ చేశారు. బోటింగ్ ఏర్పాట్లను సిబ్బంది పర్యవేక్షించారు. ప్రాజెక్టు అందాలను తిలకించేందుకు ఉత్సుకత చూపారు. చలి కొంచెం తక్కువగా ఉండటంతో పర్యాటకుల సంఖ్య పెరిగింది. కుటుంబ సమేతంగా వన భోజనాలు చేశారు. సెల్ఫీలు తీసుకున్నారు. ఎలాంటి సంఘటనలు జరుగకుండా సీసీ కెమెరాల ఆధారంతో సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు.