మొయినాబాద్ : మండలంలోని విద్యాజ్యోతి, జేబీఐఈటీ, కేజీరెడ్డి, గ్లోబల్ ఇంజినీరింగ్ కళశాలతో పాటు కెఎల్హెచ్ యూనివర్సిటీల్లో ఎంసెట్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. గురువారం జేఎన్టీయూ హైదరాబాద్ వైస్ చాన్సలర్ నర్సింహారెడ్డి చిలుకూరులోని కేజీరెడ్డి ఇంజినీరింగ్ కళశాల పరీక్ష కేంద్రాన్ని సందర్శించి పరీక్ష హాలును పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈసారి 2,42,825 మంది విద్యార్థులు ఎంసెట్కు దరఖాస్తులు చేసుకున్నారన్నారు. గతేడాది 2,22 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకోగా ఈ ఏడాది 20,825 మంది అదనంగా దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. 6న ఇంజినీరింగ్ విద్యార్థులకు ఎంసెట్ పరీక్ష ఉండగా, మెడికల్, అగ్రికల్చర్ విద్యార్థులకు 8,9 తేదీల్లో పరీక్ష ఉంటుందని చెప్పారు. ఆయనతో పాటు కేజీరెడ్డి కళాశాల చైర్మన్ కృష్ణారెడ్డి, ప్రిన్సిపాల్ జాహగీర్దార్, అరిస్టాటిల్ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్రెడ్డి ఉన్నారు.