యాచారం, జూలై31: పెద్దమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం అన్ని రంగాలలో సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని గడ్డమల్లాయగూడ గ్రామంలో పెద్దమ్మ తల్లి అమ్మవారి కళ్యాణ మహోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు.
కళ్యాణ మహోత్సవానికి హాజరైన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఆలయంలో కొలువుదీరిన అమ్మవారికి పూజలు నిర్వహించారు. స్థానికులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి మాట్లాడుతూ..మానసిక ప్రశాంతత కోసం ప్రతి ఒక్కరు భక్తి భావాన్ని తప్పనిసరిగా పెంపొందించాలన్నారు.
పురాతన ఆలయాల అభివృద్ధికి అన్ని విధాలుగాసహకరిస్తానన్నారు.
పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో ఈ ఏడాది కూడా పుష్కలంగా వర్షాలు కురిసి చెరువులు, కుంటలు నిండి రైతులు సుభిక్షంగా ఉండాలన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానన్నారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ జంగమ్మ, పీఏసీఎస్ చైర్మేన్ రాజేందర్రెడ్డి, సర్పంచ్ జంగయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్నాటి రమేష్గౌడ్, నాయకులు చిన్నోళ్ల యాదయ్య, జర్కోని రాజు, కల్లూరి శివ, మహ్మద్ ఖాజు, అచ్చన దానయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.