కడ్తాల్, డిసెంబర్ 31 : ప్రతి వ్యక్తి జ్ఞాన యోగి కావాలన్నదే సుభాశ్ పత్రీజీ సంకల్పమని ది ఇండియన్ పిరమిడ్ స్పిరిచ్యువల్ మూవ్మెంట్ వ్యవస్థాపక సభ్యురాలు స్వర్ణమాల పత్రీ అన్నారు. మండల కేంద్రం సమీపంలోని కైలాసపురిలోని మహేశ్వర మహా పిరమిడ్లో జరుగుతున్న పత్రీజీ ధ్యాన మహాయాగాలు శనివారం ముగిశాయి. చివరి రోజు ఉదయం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు నిర్వహించిన ప్రాతఃకాల ధ్యానంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ధ్యానులు, పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్వర్ణమాల పత్రీ మాట్లాడుతూ.. ఎప్పుడైనా, ఎక్కడైనా ధ్యానం చేయవచ్చని, నిత్యం ధ్యాన సాధనతో మనస్సు ప్రశాంతాంగ ఉంటుందని తెలిపారు. అనంతరం స్వర్ణమాల పత్రీ జీవిత అనుభవాలతో కూడిన స్వర్ణామృతం పుస్తకాన్ని పిరమిడ్ మాస్టర్లు ఆవిష్కరించారు. ధ్యాన వేదికపై ప్రముఖ సింగర్ మధుప్రియ పాడిన పాటలకు ధ్యానులు డ్యాన్స్ చేశారు. అనంతరం పిరమిడ్ ప్రధాన వేదికపై ట్రస్ట్ సభ్యులను, వలంటీర్లను స్వర్ణమాల పత్రీ ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పిరమిడ్ ట్రస్ట్ చైర్మన్ విజయభ్కార్రెడ్డి, సభ్యులు సాంబశివరావు, హనుమంతురాజు, బాలకృష్ణ, లక్ష్మి, శ్రీరామ్గోపాల్, మాధవి, జయశ్రీ, సౌమ్యకృష్ణ ఉన్నారు.