తాండూరు, నవంబర్ 29 : తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలో విద్యార్థినులపై జరుగుతున్న ఆకతాయిల వేధింపులను వెంటనే అరికట్టాలని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్పటేల్ పోలీస్ శాఖను కోరారు. మంగళవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వెళ్లిన శుభప్రద్పటేల్కు బాలికలు తమ గోసను వెల్లడించారు. స్పందించిన శుభప్రద్పటేల్ షీ టీంను పిలిపించి విద్యార్థుల గోసను వినిపించారు.
డీఎస్పీ, ఎస్పీకి ఫోన్ చేసి కళాశాల ప్రాంగణంలో జరుగుతున్న సంఘటనలను వారి దృష్టికి తీసుకువెళ్లారు. మహిళల రక్షణకు ప్రత్యేక చట్టాలు వచ్చినా.. విద్యార్థులు ఇబ్బందుల ఎదుర్కోవడం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సంబంధిత పోలీస్ శాఖ వారు వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు కళాశాలలో జరుగుతున్న విషయాలను పట్టించుకోవాలని సూచించారు. ఇకమీదట ఏమీ జరుగదని.. కళాశాలకు నిత్యం వస్తూ చక్కగా చదువుకోవాలని విద్యార్థినులకు సూచించారు.