బాలికలకు భరోసా కల్పించేలా కేసీఆర్ ప్రభుత్వం అమలుచేసిన విధానాలనే ఈసారి కూడా విద్యాశాఖ కొనసాగిస్తున్నది. ఎప్పటిలాగే ప్రభుత్వ పాఠశాలల్లో బాలికల సాధికారత క్లబ్లను ఏర్పాటు చేస్తున్నది. ఇటీవలే రంగారెడ్డి జిల్లాలోని వంద పాఠశాలల్లో ఏర్పాటు చేసింది. విజ్ఞానం, నైపుణ్యం, ఆత్మవిశ్వాసం తదితర వాటిని పెంపొందింపజేసి పాఠశాల స్థాయిలోనే బాలికల్లో ఆత్మైస్థెర్యాన్ని నింపేలా ఈ క్లబ్లు పనిచేసేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించింది.
బాలికలకు శారీరక, లైంగిక వేధింపులు జరుగకుండా చూడడం.. లైంగిక దాడుల నుంచి రక్షణ కల్పించడం, బాల్య వివాహాలు జరుగకుండా చూడడం తదితర అంశాలపై సాధికారత క్లబ్లు అవగాహన కల్పించనున్నాయి. అలాగే కౌమార బాలికల ఆరోగ్యం, వ్యక్తిగత శుభ్రత, లింగ సమానత్వం, జీవన నైపుణ్యాల పెంపు, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, బాలికలపై హింసను అరికట్టేలా క్లబ్ల సభ్యులు చర్యలు చేపడతారు. దీంతో ఎన్నో సామాజిక సమస్యల నుంచి బాలికలకు భద్రత, భరోసా కల్పించినట్లవుతుంది.
-రంగారెడ్డి, డిసెంబర్ 27(నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, డిసెంబరు 27 (నమస్తే తెలంగాణ) : బాలికలకు భరోసా కల్పించేలా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేసిన విధానాలనే ఈసారి కూడా విద్యాశాఖ కొనసాగిస్తున్నది. గతంలో మాదిరిగానే విద్యాశాఖ ప్రభుత్వ పాఠశాలల్లో బాలికల సాధికారత క్లబ్లను ఏర్పాటు చేస్తున్నది. రంగారెడ్డి జిల్లాలో ఉన్న జడ్పీ ఉన్నత పాఠశాలలు, ప్రాథమికోన్నత, కస్తూర్బా పాఠశాలల్లోని వంద పాఠశాలల్లో క్లబ్లను ఇటీవలే ఏర్పాటు చేశారు. విజ్ఞానం, నైపుణ్యం, ఆత్మవిశ్వాసం తదితర వాటిని పెంపొందింపజేసి పాఠశాల స్థాయిల్లోనే బాలికల్లో ఆత్మైస్థెర్యాన్ని నింపేలా క్లబ్ ప్రణాళికలను రూపొందించారు. ఎన్నో సామాజిక సమస్యల నుంచి బాలికలకు భద్రత కల్పించడంలో సాధికారత క్లబ్లు కీలకపాత్ర పోషించనున్నాయి.
ప్రభుత్వ పాఠశాలల్లోని బాలికలకు భద్రతతోపాటు భరోసా కల్పించేందుకు బాలికల సాధికారత క్లబ్(జీసీఈసీ)లను ఏర్పాటు చేస్తున్నారు. వీటి ఏర్పాటు కోసం విద్యాశాఖ ఈ నెల మొదటి వారంలోనే ఉత్తర్వులు జారీ చేయడంతో రంగారెడ్డి జిల్లాలో అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టారు. కస్తూర్బా పాఠశాలతోపాటు ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలలను కలిపి వంద పాఠశాలలను ఎంపిక చేసి క్లబ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో క్లబ్లో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చైర్మన్గా, ఉపాధ్యాయురాలు కన్వీనర్గా, ఒక మహిళా కానిస్టేబుల్, షీ టీమ్ ఇన్చార్జితోపాటు ప్రతి తరగతికి ఇద్దరు విద్యార్థినులు సభ్యులుగా ఉంటారు.
బాలికలకు శారీరక, లైంగిక వేధింపులు జరగకుండా చూడడం.. లైంగిక దాడుల నుంచి రక్షణ కల్పించడం.. బాల్య వివాహాలు జరగకుండా చూడడం తదితర అంశాలపై సాధికారత క్లబ్లు అవగాహన కల్పించనున్నాయి. అలాగే కౌమార బాలికల ఆరోగ్యం, వ్యక్తిగత శుభ్రత, లింగ సమానత్వం, జీవన నైపుణ్యాల పెంపు, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, బాలికలపై హింసను అరికట్టేలా క్లబ్ సభ్యులు చర్యలు చేపడతారు. బాలబాలికలు ఉన్న పాఠశాలల్లో బాలురు బాలికలతో ఏ విధంగా వ్యవహరించాలో తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారు. ప్రతి నెలా విధిగా సమావేశాలు నిర్వహించి ఎక్కడైనా బాలికలకు సమస్యలు ఎదురైతే పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు.
పాఠశాలల్లో చదివే కౌమార బాలికలకు అనేక సమస్యలు ఎదురవుతాయి. వీటి వల్ల వారు చదువుపై దృష్టి సారించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం పాఠశాలల్లో జీసీఈసీ క్లబ్లను ఏర్పాటు చేస్తున్నది. బాలికల్లో ఆత్మైస్థెర్యాన్ని నింపేందుకు ఈ క్లబ్లు దోహదపడుతాయి. ప్రతి నెలా సమావేశమై కౌమార బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలు, లైంగిక వేధింపులు తదితర సమస్యలను చర్చించి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారు.
– సుజాత, జెండర్ ఈక్విటీ కో-ఆర్డినేటర్, రంగారెడ్డి జిల్లా