‘సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి గడపకూ అందుతున్నాయి.. రాష్ట్ర పథకాలు దేశవ్యాప్తం కావాలె..’ అని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి, కందుకూరు మండలం మాదాపూర్ గ్రామం నుంచి వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరగా, గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కుల, మత రాజకీయాలు చేసే పార్టీలకు రాబోవు రోజుల్లో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రజల అండ ఉన్నదన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. అభివృద్ధి చూసి ఓర్వలేక తప్పుడు ప్రచారం చేసేవారికి ప్రజలు బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.
బడంగ్పేట, జనవరి 22 : సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో పలు పార్టీలకు చెందిన నాయకులు కార్పొరేటర్ అర్జున్ ఆధ్వర్యంలో మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మతం, కులం పేరుతో రాజకీయాలు చేస్తున్న పార్టీలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కులాలమతాలకతీతంగా పనిచేస్తుందన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేరుతున్నాయన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు రాంరెడ్డి, నాయకులు వెంకట్ రెడ్డి, నరేశ్, శివానీరెడ్డి ఉన్నారు.
కందుకూరు : రాష్ట ప్రభుత్వ పథకాలను దేశవ్యాప్తంగా విస్తరించడానికి కేసీఆర్ నాయకత్వం కావాలని మంత్రి సబితారెడ్డి తెలిపారు. దేశంలో బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదని ఆమె స్పష్టం చేశారు. మండల పరిధిలోని మాదాపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ జంగారెడ్డితోపాటు 150 మంది కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఆ పార్టీలకు రాజీనామా చేసి మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఎస్సీ పార్టీకి చెందిన సుధీర్కుమార్ కూడా చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీలకు రాష్ట్రంలో చోటులేదన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ జంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ చంద్రశేఖర్ ఉన్నారు.