‘వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్ వద్దు.. మూడు గంటలు చాలు’ అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నిరసనలు కొనసాగుతున్నాయి. మూడోరోజు గురువారం రాస్తారోకోలు, ధర్నాలతో ఉమ్మడి జిల్లా దద్దరిల్లింది. సమైక్యపాలనలో ఎన్నో కష్టాలకోర్చిన రైతులకు కేసీఆర్ సర్కారు సాగునీరు, ఉచిత విద్యుత్ అందించి వ్యవసాయాన్ని పండుగలా మార్చుతుంటే.. రేవంత్ మాత్రం విద్యుత్ సరఫరా నియంత్రించాలంటూ ప్రేలాపనలు చేయడంపై రైతులు మండిపడ్డారు. రైతులను మళ్లీ ఇబ్బందుల్లోకి నెట్టేలా రేవంత్ తీరు ఉన్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన రాస్తాకోలు, నిరసన ర్యాలీల్లో రైతులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మహేశ్వరంలోని కందుకూరులో జరిగిన నిరసనల్లో విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో రైతులు బాగుపడుతుంటే రేవంత్రెడ్డి కండ్లు మండుతున్నాయన్నారు. ప్రజలు ఇదంతా గమనిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు వాతలు పెట్టడం ఖాయమన్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, మహేశ్రెడ్డి, నరేందర్రెడ్డి, కాలె యాదయ్య తదితరులు పాల్గొని రేవంత్రెడ్డి తీరుపై భగ్గుమన్నారు. రేవంత్ రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూలై 13
వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు అవసరం లేదన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై గురువారం కూడా ఉమ్మడి జిల్లాలో ఆందోళనలు వెల్లువెత్తాయి. అన్నదాతలు, బీఆర్ఎస్ శ్రేణులు వివిధ రూపాల్లో నిరసనలు తెలిపారు. రైతులను మళ్లీ అగాధంలోకి నెట్టేలా మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల జోలికి వస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. రేవంత్రెడ్డి దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించి దహనం చేశా రు. మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మండల కేం ద్రంలో జరిగిన మహాధర్నాలో మంత్రి సబితారెడ్డి పాల్గొని రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై భగ్గుమన్నారు. కొడంగల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి అంబేద్కర్ కూడలి వరకు రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను ర్యాలీ తీసి ఎమ్మెల్యే నరేందర్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, రైతులు దహనం చేశారు. అదేవిధంగా ధారూరు మండలంలోని నాగసముందర్ గ్రామ సమీపంలోని విద్యుత్తు సబ్స్టేషన్ ఎదుట పీసీసీ అధ్యక్షుడి దిష్టిబొమ్మను చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్, రైతులు దహనం చేశారు. పరిగి మం డలంలోని బహార్పేట్ నుంచి బస్టాండ్ వరకు రేవంత్రెడ్డి దిష్టిబొమ్మతో ర్యాలీ తీసి దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మహేశ్రెడ్డి పాల్గొన్నారు. చేవెళ్ల నియోజకవర్గంలోని శంకర్పల్లి, చేవెళ్ల మండలాల్లో నిర్వహించిన ధర్నాల్లో ఎమ్మెల్యే కాలె యాదయ్య పాల్గొన్నారు.
కొడంగల్, జూలై 13: గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో రైతులు సరిగ్గా కరెంటు సరఫరా కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని.. బోరు బావుల్లో నీళ్లు ఉన్నా.. కరెంట్ ఎప్పుడు వస్తుందో.. పోతుందో తెలియక రాత్రీపగలు పడిగాపులు కాయాల్సి వచ్చిందని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి అంబేద్కర్ కూడలి వరకు బీఆర్ఎస్ నాయకులు, రైతులు పెద్ద ఎత్తున ర్యాలీ తీసి రేవంత్ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో ఏడాదికి మూడు పంటలు పండించుకునే అవకాశం ఉందని.. అదే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మూడు గంటలపాటు మాత్రమే విద్యుత్తు సరఫరా అవుతుందని.. అందువల్ల రైతులు ఏ ప్రభుత్వం కావాలో తేల్చుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారని.. అం దుకోసం పంటల సాగుకు ఇబ్బందులు కావొద్దనే ఉద్ద్దేశంతో అదునుకు ముందే రైతుబంధు పథకం క్రింద ఏడాదికి రెండుసార్లు ఎకరానికి రూ. ఐదు వేల చొప్పున రూ.పది వేలను పంపిణీ చేస్తూ ఆదుకుంటున్నారని కొనియాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు చీకటి రోజులే వస్తాయని గుర్తు చేశారు. గతంలో అన్నదాతలను ఇబ్బందులు పెట్టిన ఘనత ఆ పార్టీకే దక్కిందన్నా రు. ప్రజా సంక్షేమం, రైతులు, వ్యవసాయంపై రేవంత్కు అవగాహన లేదని పార్టీలు మారుతూ అధికారాన్ని చేజిక్కించుకోవాలనే వక్రబుద్ధి మాత్రమే ఉందని ఎద్దేవా చేశారు. అతడు గ్రామాల్లోకి వస్తే తరిమి కొట్టాలన్నారు. నేడు రాష్ట్రం అన్ని రంగాల్లో దేశానికి మాడల్ నిలిచిందంటే దానికి కారణం సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యలేనని కొనియాడారు. మాయమాటలు చెప్పే నాయకులు మనకు వద్దన్నా రు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులతో పాటు రైతులు తదితరులు పాల్గొన్నారు.
షాబాద్, జూలై 13 : రైతు ద్రోహి రేవంత్రెడ్డి అని.. ఆయన వ్యాఖ్యలకు రైతులు తగిన గుణపాఠం చెబుతారని చేవెళ్ల ఎమ్మె ల్యే కాలె యాదయ్య అన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్తు సరఫరాపై రేవంత్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా గురువారం చేవెళ్ల నియోజకవర్గంలోని శంకర్పల్లి, చేవెళ్ల మండలాల్లో నిర్వహించిన ధర్నాల్లో ఎమ్మెల్యే పాల్గొని రేవంత్రెడ్డి దిష్టిబొమ్మ లను దహనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతుబిడ్డగా 24 గంటల కరెంట్ ఇస్తూ రైతన్నలకు అండ గా నిలుస్తుండగా.. రేవంత్రెడ్డి వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్తు చాలని అనుచిత వ్యాఖ్యలు చేసిన రైతు ద్రోహిగా నిలి చారన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రైతులను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ రెండు పార్టీలకు ఓటు వేస్తే రైతులను నట్టేట ముంచుతారన్నారు. అన్నదాతల అభ్యున్నతే సీఎం కేసీ ఆర్ ధ్యేయమని అందువల్ల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు అండగా నిలవాలన్నారు. కార్యక్రమంలో మాలతి, కాలె శ్రీకాంత్, గోవిందమ్మ, ఎంపీపీలు విజయలక్ష్మి, గోవర్ధన్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, ఆయా మండలాల అధ్యక్షులు ప్రభాకర్, గోపాల్, వాసుదేవ్కన్నా, రమణారెడ్డి, ప్రవీణ్కుమార్, గోపాల్రెడ్డి, గిరిధర్రెడ్డి, మాణిక్యరెడ్డి, సాయికుమార్, వెంకటేశ్, మహే శ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ధారూరు, జూలై 13: వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటుపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అన్నదాతలు భగ్గుమన్నారు. గురువారం మండలంలోని పలు గ్రామాల్లో రైతులు, బీఆర్ఎస్ నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మండలంలోని నాగసముందర్ గ్రామ సమీపంలోని విద్యుత్తు సబ్స్టేషన్ ఎదు ట ధర్నా నిర్వహించి రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, రైతులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు దహనం చేశారు. కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు రాజూనాయక్, వేణుగోపాల్ రెడ్డి, అంజయ్య, సంతోష్కుమార్, వెంకటయ్య, జైపాల్ రెడ్డి, రాములు, రాజుగుప్త్తా, అంజయ్య, మహేశ్, చంద్రమౌళి, రవీందర్, లక్ష్మయ్య, మోహిజ్, శ్రీకాంత్ రెడ్డి, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.
పరిగి, జూలై 13: రైతులు బాగుపడుతుంటే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఓర్వలేక కండ్లల్లో నిప్పులు పోసుకుంటున్నాడని, అందుకే వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ చాలని ప్రేలాపనలు చేస్తున్నాడని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి మండిపడ్డారు. గురువారం రేవంత్ వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పరిగిలోని బహార్పేట్ నుంచి బస్టాండ్ వరకు రేవంత్రెడ్డి దిష్టిబొమ్మతో ర్యాలీ తీసి అనంతరం దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేశ్రెడ్డి మాట్లాడుతూ రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరోసారి వ్యవసాయాన్ని పూర్తిగా దెబ్బతీసేలా ఉన్నాయన్నారు. కాంగ్రెస్ హయాంలో విత్తనాలు, ఎరువుల కో సం చెప్పులు లైన్లో పెట్టి రోజుల తరబడి వేచి ఉండటం, ఏ అర్ధరాత్రి కరెంటు వస్తుందోనని నిరీక్షించే పరిస్థితి వస్తుందేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. రేవంత్ వెంటనే రైతులకు క్షమాపణ చెప్పాల ని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు పక్షపాతిగా పని చేస్తున్నదని.. రాష్ట్రంలో కేసీఆర్ పాలన ఉన్నంత వరకూ రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. కార్యక్రమంలో పరి గి, పూడూరు మండలాల ఎంపీపీలు అరవిందరావు, మల్లేశం, మున్సిపల్ చైర్మన్ అశోక్, పీఏసీఎస్ చైర్మన్ శ్యాంసుందర్రెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు రాజేందర్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఆంజనేయులు, ప్రవీణ్కుమార్రెడ్డి, వైస్ ఎంపీపీ సత్యనారాయణ, ఎంపీటీసీలు వెంకట్రాంరెడ్డి, రవి, సర్పంచ్లు వెంకట్రాంకృష్ణారెడ్డి, వెంకటయ్య, జగన్, ప్రవీణ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ భాస్కర్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు సంతోష్, వెంకటయ్య, మౌలానా, రవికుమార్, కృష్ణ, రవీంద్ర, నాగేశ్వర్, నాయకులు పాల్గొన్నారు.