బడంగ్పేట్/ ఆర్కేపురం, మార్చి 19 : చిత్రలేఔట్ కాలనీ అభివృద్ధికి కృషి చేస్తానని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఆర్కేపురం డివిజన్ చిత్రలేఔట్ కాలనీ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ సభ్యులు ఆదివారం మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ప్రతి కాలనీలో మౌలిక వసతులు కల్పించి మోడల్ కాలనీలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కాలనీల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, అందులో భాగంగానే అధిక నిధులు కేటాయిస్తుందన్నారు. కాలనీ వాసులందరూ కలిసికట్టుగా ఉండి కాలనీలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు పెండ్యాల నగేశ్, కోశాధికారి సద్గుణ, కాలనీ వాసులు సత్యనారాయణరెడ్డి, దివాకర్రావు, శ్రీరామ్రెడ్డి, మధుసూదన్రావు, రాఘవరెడ్డి, ఎర్రం శ్రీనివాస్, రమాదేవి, వాణిశ్రీ, నర్మద, ప్రవీణారెడ్డి, సునీత, సుమ, జ్యోత్స్న, లక్ష్మి, రామచందర్రావు, రవీందర్, శరత్ పాల్గొన్నారు.
పేదలకు ఆసరా సీఎం సహాయనిధి అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట్ 12వ డివిజన్లో ఉంటున్న శ్రీనివాస్ ఆరోగ్యం బాగలేక పోవడంతో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నాడు. సీఎం రిలీఫ్ఫండ్కు దరఖాస్తు చేసుకోగా అతనికి రూ. 60 వేలు మంజూరు అయ్యాయి. అట్టి చెక్కును మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్పొరేటర్ ఇంద్రావత్ రవినాయక్ ఆధ్వర్యంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సౌందర్య విజయ్, బంగారు అరుణ పాల్గొన్నారు.
ప్రతి విద్యార్థి పోటీ పరీక్షల్లో విజయం సాధించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం ఇంద్రన్న ట్రస్టు ఆధ్వర్యంలో ఎస్సై కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్స్ స్టడీ మెటీరియల్ను ఆమె అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులు బాగా చదివి జన్మనిచ్చిన తల్లి దండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆమె అన్నారు. ఇంద్రన్న ట్రస్టు నిర్వాహకులు చేస్తున్న సేవలను గుర్తించి పీజేఆర్, సురేశ్ గారిని మంత్రి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇంద్రన్న ట్రస్టు నిర్వాహకులు పీజేఆర్, సురేశ్ పోలీసు అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.