యాచారం, డిసెంబర్ 28: డ్వాక్రా సంఘాల మహిళలకు బ్యాంకు లింకేజీ రుణాల చెక్కుల పం పిణీ కార్యక్రమం గురువారం సాయిశరణం ఫం క్షన్ హాల్లో ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నట్లు ఐకేపీ ఏపీఎం సతీశ్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండలంలోని 552 డ్వా క్రా గ్రూపు సంఘాలకు రూ.38.24 కోట్లను చెక్కుల రూపంలో పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరవుతారని తెలిపా రు.
యాచారం స్టేట్ బ్యాంకు ద్వారా 102 సం ఘాలకు రూ.8.03 కోట్లు, నందివనపర్తి ఎస్బీఐ ద్వారా 21 సంఘాలకు రూ.1.74కోట్లు, మీర్ఖాన్పేట ఎస్బీఐ ద్వారా 54 సంఘాలకు రూ.3 కోట్లు, మేడిపల్లి ఇండియన్ బ్యాంకు ద్వారా 36 సంఘాలకు రూ.2.73 కోట్లు, మాల్ యూనియ న్ బ్యాంకు ద్వారా 48 సంఘాలకు రూ.3.15 కోట్లు, ఇబ్రహీంపట్నం తెలంగాణ గ్రామీణ బ్యాంకు ద్వారా 32 సంఘాలకు రూ.1.99 కో ట్లు, యాచారం తెలంగాణ గ్రామీణ బ్యాంకు ద్వా రా 12 సంఘాలకు రూ.67లక్షలు, గున్గల్ తెలంగాణ గ్రామీణ బ్యాంకు ద్వారా 126 సం ఘాలకు రూ.9.08 కోట్లు, చింతపట్ల తెలంగాణ గ్రామీణ బ్యాంకు ద్వారా రూ.7.85 కోట్ల చెక్కుల పంపిణీ జరుగనున్నదన్నారు.