ఇబ్రహీంపట్నం రూరల్, మే 13 : అన్నదాతల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని రైతుబంధు సమితి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం ఆయ న మండలంలోని పోల్కంపల్లి గ్రామంలో సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేం ద్రా న్ని మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రయ్యతో కలిసి ప్రారంభించి మాట్లాడారు.
గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో తెలంగాణ రైతులు అధోగతి పాలయ్యారని.. తెలంగాణ ఏర్పడి కేసీఆర్ సీఎం అయిన తర్వాతే మనకు మంచి రోజులు వచ్చాయన్నారు. రైతులు తమ ధాన్యాన్ని దళారులకు విక్రయించకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి.. మద్దతు ధరను పొందాలని సూచించారు. కార్యక్రమంలో సహకార సంఘం చైర్మన్ రాజశేఖర్రెడ్డి, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు అంజిరెడ్డి, సర్పంచ్ ఆండాళు, ఎంపీటీసీ మంగ, రైతులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.