కులకచర్ల, జనవరి 7 : విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని కబడ్డీ అసోసియేషన్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు పరశురాంనాయక్ తెలిపారు. జిల్లాస్థాయి జూనియర్ బాలబాలికల కబడ్డీ క్రీడాకారుల ఎంపిక కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్, వికారాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమచర్ కబడ్డీ పౌండేషన్ ఆప్ ఇండియా సహకారంతో ఆదివారం కులకచర్ల మండల కేంద్రంలోని వివేకానంద జూనియర్ కళాశాలలో నిర్వహించారు.
15 మంది బాలురు, 15 మంది బాలికలు ఎంపికయ్యారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఈ నెల 11నుంచి జరిగే పోటీల్లో వికారాబాద్ జిల్లా జట్టు పాల్గొననున్నది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పరశురాంనాయక్తో పాటు కబడ్డీ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వినోద్కుమార్, కన్వీనర్ నరేందర్నాయక్, రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకుడు ప్రహ్లాద్రావు హాజరై క్రీడాకారులతో పాటు క్రీడల నిర్వాహకుడు రాజేందర్నాయక్ను అభినందించారు.