వికారాబాద్, జనవరి 6 : వికారాబాద్ జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ తన చాంబర్ లో శనివారం సమావేశం నిర్వహించి డ్రాఫ్ట్ ఓటర్ జాబితాను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విడుదల చేసిన ఎలక్టోరల్ డ్రాఫ్ట్ పబ్లికేషన్లో ఏమైనా ఆక్షేపణలు, అభ్యంతరాలు ఉంటే ఈ నెల 22వ తేదీ వరకు తెలియజేయాల్సి ఉంటుందన్నారు.
అభ్యంతరాల పరిశీలన అనంతరం తుది ఓటరు జాబితాను ఫిబ్రవరి 8వ తేదీన ప్రకటిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల ప్రతినిధులకు డ్రాఫ్ట్ ఓటరు జాబితాను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎలక్షన్ సూపరింటెండెండెంట్ శ్రీనివాస్, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.