వికారాబాద్ : విద్యార్థులు బాగా చదివి ఉత్తీర్ణులవ్వాలని ఎమ్మెల్యే మోజోబ్ఖాన్ తెలిపారు. గురువారం ఏఐఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాల మేరకు వికారాబాద్ పట్టణంలోని ఆలంపల్లి ఉర్దూమీడియం పాఠశాలలో ఎప్పటిలాగే ఈసారి కూడా ఉచితంగా ఫ్రీగైడ్స్ను 10వ తరగతి విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మోజోబ్ఖాన్ మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులు బాగా చదువుకొని, భవిష్యత్లో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
పేద పిల్లలకు ఇలా ఉచితంగా గైడ్స్ అందించి, ఉన్నత చదువుల కోసం వారిని ప్రోత్సహించాలనే మంచి ఆలోచనకు శ్రీకారం చుట్టిన అసదుద్దీన్ ఓవైసీకి ప్రత్యేక కృతజ్ఞతుల తెలిపారు. కార్యక్రమంలో వికారాబాద్ ఏఐఎంఐఎం పార్టీ ఇన్చార్జి హస్నాధీర్, శివారెడ్డిపేట కౌన్సిలర్ షరీఫ్, జాకీర్ మొన్, మహమ్మద్ధూస్, బిలాల్, మిర్జాఫీరోజ్బేగ్ పాల్గొన్నారు.