ఆమనగల్లు : రాష్ట్ర ప్రభుత్వం మహిళ సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పేర్కొన్నారు. శనివారం ఆమనగల్లు మున్సిపాలిటీలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మున్సిపల్ చైర్మన్ రాంపాల్నాయక్, వైస్ చైర్మన్ దుర్గయ్య, జడ్పీటీసీ విజితారెడ్డి, అనురాధతో కలిసి మహిళలకు చీరలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ యేటా ఆడబిడ్డలు కొత్త చీరలను కట్టుకొని పండుగ వాతావరణంలో బతుకమ్మ పండుగను జరుపుకోవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఆడపడుచులకు చీరలను పంపిణీ చేస్తున్నట్లు గుర్తు చేశారు.
అన్ని మండలాల్లో ఆడబిడ్డలకు రాష్ట్ర ప్రభుత్వం బతుమ్మచీరలను పంపిణీ చేస్తుందన్నారు. ఆమనగల్లు మండల కేంద్రంతో పాటు మున్సిపాలిటీలో 10,000, కడ్తాల మండలంలో 10,000, మాడ్గుల మండలంలో 13,000, తలకొండపల్లి మండలానికి 12వేల చీరలను ప్రభుత్వం కేటాయించింది. ఆయా గ్రామాల్లో ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.