వికారాబాద్, డిసెంబర్ 23 : దివ్యాంగులమని మానసికంగా కుంగిపోకుండా అందరితో సమానంగా సమాజంలో పోటీపడుతూ అన్ని రంగాల్లో రాణించాలని పరిగి, తాండూరు ఎమ్మెల్యేలు రా మ్మోహన్రెడ్డి, మనోహర్రెడ్డి అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరం లో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమాన్ని మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ జిల్లా అధికారిణి లలితాకుమారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు జ్యోతి ప్రజ్వలన చేసిన కా ర్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. అంగవైకల్యంతో కుమిలిపోకుం డా మీలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసి ప్రగ తి పథంలో ముందుకు సాగాలన్నారు. అర్హులైన దివ్యాంగులందరికీ సదరం క్యాంపుల ద్వారా సులువుగా సర్టిఫికెట్లు అందేలా చూస్తామన్నారు. ప్రస్తుత సమస్యలపై వినతిపత్రం అందజేస్తే సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా కృషి చే స్తామన్నారు. అనంతరం కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. దివ్యాంగులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. అనంత రం అర్హులైన లబ్ధిదారులకు ల్యాప్టాప్లు, ట్రై సై కిళ్లను అందజేశారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఆటల పో టీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మంజులా రమేశ్, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్కుమార్, అదన పు కలెక్టర్లు రాహుల్ శర్మ, లింగ్యా నాయక్, ఎంపీ పీ చంద్రకళ, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.