షాద్నగర్రూరల్, జనవరి 24 : ఉమ్మడి పాలనలో అభివృద్ధికి దూరంలో ఉన్న పల్లెలు నేడు ప్రత్యేక రాష్ట్రంలో పల్లెలు అభివృద్ధి చెందుతూ పట్టణాలను తలపిస్తున్నాయని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఫరూఖ్నగర్ మండలంలోని కాశిరెడ్డిగూడలో గ్రామ పంచాయతీ భవనం, వైకుంఠధామం, క్రీడా ప్రాంగణం, మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్, కంపోస్టు యార్డును మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిపాలన సౌలభ్యం కోసం 500 జనాభా దాటిన గ్రామాలు, తండాలను ప్రభుత్వం గ్రామ పంచాయతీలుగా మార్చిందన్నారు. గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. అభివృద్ధి పనుల్లో ప్రజలు భాగస్వాములవ్వాలన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని వివరించారు. సంపూర్ణ అక్షరాస్యతను సాధించేలా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య, మౌలిక వసతులను సమకూర్చేలా మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. అనంతరం విద్యార్థులు దేశభక్తి గేయాలకు చేసిన నృత్యాలను ఆయన అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, సర్పంచ్లు దీన, శ్రీనివాస్యాదవ్, శ్రీనివాస్రెడ్డి, వైస్ ఎంపీపీ మౌనిక, ఉప సర్పంచ్ రాజేందర్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మణ్నాయక్, నాయకుడు మన్నేనారాయణ యాదవ్ పాల్గొన్నారు.