కొందుర్గు, డిసెంబర్ 23 : గ్రామాలు, పట్టణాలను అభివృద్ధి పరచడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్వన్గా నిలుస్తున్నదని జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి అన్నారు. గురువారం కొందుర్గు మండలంలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్తో కలిసి పర్యటించారు. మండల కేంద్రంలో రూ. 10లక్షల వ్యయంతో మహిళా సమాఖ్య భవనానికి శంకుస్థాపన, రూ.5లక్షలతో సీసీ రోడ్లు, చెక్కలలోనిగూడలో రూ.10లక్షలతో అంగన్వాడీ, గంగన్నగూడలో రూ.5లక్షలతో అంతర్గత మురుగు కాలువలు, విశ్వనాథ్పూర్లో రూ.5లక్షలతో అంతర్గత మురుగు కాలువలు, లక్ష్మీదేవిపల్లిలో రూ.10లక్షలతో మహిళా సమాఖ్య భవనం, పాత ఆగిర్యాలలో రూ.10లక్షలతో మహిళా సమాఖ్య భవనం, తిరుమల దేవునిపల్లిలో రూ.10లక్షలతో మహిళా సమాఖ్య భవనం, తంగెళ్లపల్లిలో రూ.5లక్షలతో సీసీ రోడ్డు పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి పరచడమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు.
మారిన గ్రామాల రూపురేఖలు
టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామాల రూపురేఖలు పూర్తి స్థాయిలో మారి పోయాయని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. గురువారం కొందుర్గు మండలంలోని ఆయా గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డితో కలిసి శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాలకు కావాల్సిన అన్ని వసతులను ముఖ్యమంత్రి కేసీఆర్ కల్పిస్తున్నారన్నారు. కార్యక్రమంలో తాసిల్దారు శ్రీకాంత్రెడ్డి, ఎంపీపీ జంగయ్య, జడ్పీటీసీలు రాగమ్మ, స్వరూప, వైస్ ఎంపీపీ రాజేశ్పటేల్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీధర్రెడ్డి, హఫీజ్, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు నర్సింహారెడ్డి, నాయకులు ఎదిర రామకృష్ణ, రాములు, దర్గా రామచంద్రయ్య, రెడ్డి నర్సింహులు పాల్గొన్నారు.