చేవెళ్ల రూరల్, ఏప్రిల్ 17;తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం గ్రామాల్లో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. ఎక్కడ చూసినా పచ్చదనంతో గ్రామాల్లో హరిత శోభ సంతరించుకున్నది. పట్టణాలకు దీటుగా గ్రామాలకు సీఎం కేసీఆర్ నిధులు కేటాయిస్తున్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసుకొని మిగతా గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నది చేవెళ్ల మండల పరిధిలోని ముడిమ్యాల్ గ్రామం.
ప్రతి ఇంటి ముందు పచ్చని మొకలు, స్ట్రీట్ స్తంభాలకు ఎల్ఈడీ లైట్లు, ప్రతి గల్లీకి సీసీ రోడ్డు, ప్రభుత్వ, కమ్యూనిటీ భవనాలకు పెయింటింగ్, తడిపొడి చెత్తను వేరు చేసేలా డంపింగ్ యార్డు, మొకల పెంపకానికి నర్సరీ, హిందూ, ముస్లింలకు సపరేట్గా శ్మశాన వాటికలు… ఇలా చెప్పుకుంటూ పోతే ఆ గ్రామంలో లేనిదంటూ ఏమీ ఉండదు. ఆ గ్రామ సర్పంచ్ శేరి స్వర్ణలత దర్శన్ ప్రభుత్వ నిధులతో పాటు దాతల సహకారం, సొంత ఖర్చులతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఇటీవల స్వయాన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి గ్రామాన్ని సందర్శించి గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులు, నూతనంగా నిర్మించిన కోదండరామాలయ నిర్మాణంపై సంతృప్తిని వ్యక్తం చేశారు. బాగా పని చేస్తున్నారంటూ సర్పంచ్ను ప్రశంసించారు.
గెలవగానే మహాత్ముల విగ్రహాలు..
ముడిమ్యాల గ్రామంలో దాదాపు 1800 జనాభా ఉంటుంది. ఇందులో చాలా వరకు వ్యవసాయంపై ఆధారపడే వారే.. గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా గెలవగానే గ్రామస్తులు, యూత్ సంఘం నేతలు కోరిక మేరకు మహాత్ముల విగ్రహాలను పెట్టించారు. దాతల సహకారంతో చౌరస్తాలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేదర్, గ్రామపంచాయతీ వద్ద మహాత్మాగాంధీ, సూల్ దగ్గర స్వామి వివేకానంద విగ్రహాలు పెట్టించారు. ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్యలు ఈ విగ్రహాలను ఆవిషరించారు.
దాతల సహకారం..
కేవలం ప్రభుత్వ నిధులపైనే ఆధారపడకుండా దాతల సహకారాన్ని తీసుకుంటున్నారు. ఎల్ఈడీ స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయించడంతో పాటు మన ఊరు-మన బడి కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలకు పెయింటింగ్, టాయిలెట్లు, బెంచీలు తదితర మౌలిక వసతులను సమకూర్చారు. గ్రామంలోని ప్రధాన దారులు, గేట్ దగ్గర బెంచీలను ఏర్పాటు చేయించారు. వీధుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించి.. గ్రామ పంచాయతీకి అనుసంధానం చేశారు.
రూ.కోటి 30 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం..
ప్రభుత్వ నిధులు రూ.కోటి 30 లక్షలతో గ్రామంలోని ప్రతి గల్లీకి సీసీ రోడ్డును నిర్మించారు. అదేవిధంగా రూ.30 లక్షలతో గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీని ఏర్పాటు చేశారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా రూ.10 లక్షలతో పేయింటింగ్, టాయిలెట్ల నిర్మాణం తదితర మౌలిక వసతులను కల్పించారు. దాతల సహకారంతో రూ.3 కోట్ల 30 లక్షలతో కోదండరామాలయ నిర్మాణం చేపట్టారు.
సొంత ఖర్చులతోనూ..
గ్రామస్తుల అవసరాల మేరకు సొంతంగానూ ఖర్చు పెడుతున్నారు. గ్రామంలోని సూల్, అంగన్వాడీ భవనం, డ్వాక్రా భవనం, అంబేదర్ భవనాలకు మరమ్మతులు చేయించి రంగులు వేయించారు. డ్వాక్రా మహిళలకు రూ.50వేలు ల్యాప్ ట్యాబ్ ఇప్పించారు. గ్రామంలోని 11 మినీ ట్యాంకులకూ పెయింటింగ్ వేయించారు.
పల్లె ప్రగతిలో భేష్..
‘పల్లె ప్రగతి’ పనుల్లో ముడిమ్యాల మిగతా గ్రామాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నది. సర్పంచ్, అధికారులు అంచనాలకు మించి పనిచేసి.. మంత్రి, జడ్పీ చైర్ పర్సన్, జిల్లా అధికారులు, ఎమ్మెల్యే, ఎంపీపీలతో ప్రశంసలు పొందారు. క్లీన్ అండ్ గ్రీన్ మొదలు కొని పాతబావులు పూడ్చడం, పాత ఇండ్లు కూలగొట్టడం వరకు అన్ని పనులను పూర్తి చేశారు. జీపీ నిధుల నుంచి ట్రాక్టర్, వాటర్ ట్యాంకర్లను కొనుగోలు చేశారు. డంపింగ్ యార్డును ఏర్పాటు చేసి, మూడు భాగాలుగా విభజించారు. రెండింటిలో తడి, పొడి చెత్త మరో దాంటో సీసాలు, ప్లాస్టిక్ వేస్తున్నారు. ఇందుకోసం ప్రతి ఇంటికి రెండు చెత్తబుట్టలను పంపిణీ చేశారు. పొద్దున్నే జీపీ సిబ్బంది ట్రాక్టర్తో చెత్తను సేకరిస్తున్నారు. మొకల పెంపకానికి నర్సరీని ఏర్పాటు చేసి మొక్కలు పెంచుతున్నారు. ఇక హిందూముస్లింలకు సపరేట్గా శ్మశాన వాటికలను ఏర్పాటు చేశారు.
గ్రామస్తులు, అధికారుల సహకారంతోనే..
గ్రామస్తులు, ప్రభుత్వ అధికారుల సహకారంతోనే ముడిమ్యాల్ గ్రామ అభివృద్ధి సాధ్యమైంది. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతూ గ్రామాన్ని జిల్లాలోనే ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు పాటుపడుతా. మంత్రి సబితారెడ్డి, ఎంపీ రంజిత్రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ అనితారెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య సహకారంతో గ్రామంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతా.
– శేరి స్వర్ణలతా దర్శన్, ముడిమ్యాల్ గ్రామ సర్పంచ్