షాద్నగర్టౌన్, ఏప్రిల్ 7: ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని షాద్నగర్ డిప్యూటీ డీఎంహెచ్వో విజయలక్ష్మి అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా షాద్నగర్ పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అనునిత్యం పనుల్లో నిమగ్నమై ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదని, దీంతో వివిధ రోగాల బారి న పడుతున్నారన్నారు.
సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడం కోసం పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. ఎక్కువగా నీళ్లను తాగడంతో పాటు ఉదయం సమయాలలో వ్యాయా మం చేయాలని, తగిన నిద్రతో పాటు ఒత్తిడిని దూరం చేసుకోవాలన్నారు. సమయానికి భోజనం చేయకపోవడం, మానసిక ఒత్తిడి, వ్యాయా మం, యోగా వంటి చేయకపోవడమే వ్యా ధులకు కారణమన్నారు. కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాస్, హెల్త్ సూపర్వైజర్ శ్రీరామ, ఆశలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు