ఇబ్రహీంపట్నం, జనవరి 8 : రంగారెడ్డి జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు మంగళవారం నుంచి ఇబ్రహీంపట్నం సమీపంలోని గురుకుల విద్యాపీఠంలో జరుగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను డీఈవో సుశీందర్రావు సోమవారం పర్యవేక్షించారు.
ఈ ప్రదర్శనలను జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్బాబు మంగళవారం ప్రారంభిస్తారని, ఈ కార్యక్రమానికి జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డితోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరవుతారన్నారు. జిల్లాలోని మాడల్, జిల్లా, మండల పరిషత్లతోపాటు గురుకుల పాఠశాలల విద్యార్థులు రూపొందించిన ప్రయోగాలను ఈ వైజ్ఞానిక ప్రదర్శనలో అందుబాటులో ఉంచాలన్నారు. సలహాలు, సూచనల కోసం జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాస్ 9395390985ను సంప్రదించాలన్నారు.