ధారూరు : వికారాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా ధారూరు మండల పరిధిలోని ఆయా గ్రామాల టీఆర్ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానం చేసి, శుభాకాంక్షలు తెలిపారు. శనివారం ధారూరు మండల పరిధిలోని రాజాపూర్, నాగసముందర్ గ్రామాల టీఆర్ఎస్ నాయకులు శాలువలతో సన్మానం చేశారు.
కార్యక్రమంలో మండల పార్టీ ఉపాధ్యక్షుడు అనంతయ్య, మండల యువజన విభాగం ప్రధానకార్యదర్శి ఇందుకుమార్, గ్రామ కమిటీ అధ్యక్షుడు వెంకటేశం, ప్రధానకార్యదర్శి రమేశ్, నాయకులు ఎల్లప్ప, వంశీకృష్ణ, సలవ్దీన్, రాంచంద్రయ్య, శ్రీనివాస్, శివకుమార్, విజయ్కుమార్, రాజాపూర్ గ్రామ నాయకులు శ్రీశైలం ఉన్నారు.