కులకచర్ల, జనవరి 10 : ఐదు నెలల క్రితం దళిత బంధు పథకానికి దరఖాస్తు చేసుకున్నామని, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టు కింద దళితబంధు మంజూరు చేసిందని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం తమకు రావల్సిన దళితబంధు పథకం డబ్బులు ఇచ్చేలా చూడాలని కలెక్టర్ నారాయణరెడ్డికి వినతిపత్రం సమర్పించారు. దళిత బంధు ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు, ఉద్యమకారులు, జీవనోపాధికోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. దళితబంధు నిధులు మంజూరు చేయించి ఆదుకోవాలని కోరారు.
పరిగి టౌన్ : దళితబంధు నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం పరిగి మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన దళితబంధు లబ్దిదారులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగిన ధర్నాలో పాల్గొన్నారు. ఎన్నికల కోడ్ ముందు లబ్ధిదారులను ఎంపిక చేశారని ఎన్నికల కోడ్తో నిధులు నిలిచిపోయాయని ఎన్నికల కోడ్ ముందు గుర్తించిన లబ్ధిదారుల ఖాతాలో నిధులను వెంటనే జమ చేయాలని లబ్ధిదారులు ప్రభుత్వాన్ని కోరారు.