నందిగామ : పాడి రైతులు ఆర్థికంగా అభివృద్ధి చేదేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. వర్షాధారిత ప్రాంతం అభివృద్ధి పథకం ద్వారా మంజూరైన 20యూనిట్ల ఆవులను బుధవారం ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వ్యవసాయ రంగంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందన్నారు. ఇప్పటికే రైతుబంధు, రైతుబీమా, 24గంటల ఉచిత కరెంటు వంటి పథకాలతో పాటు పాడి పరిశ్రమలో రైతులకు సబ్సిడీపై ఆవులు, గెదేలను ఇవ్వడంతో పాటు పాలకు మద్దతు ధర కల్పించడం వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలు అందుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఉత్తమ రైతులకు సన్మానం..
నందిగామ మండలంలో ఉత్తమ రైతులుగా ఎంపికైన జిల్లెల్ల బాల్రెడ్డి, భాస్కర్రెడ్డి, చేగూరు గ్రామానికి చెందిన యాదయ్యలను ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ శాలువతో సన్మానించి, మెమోంటోను అందజేశారు. సేంద్రియ వ్యవసాయం వైపు రైతులు మొగ్గు చూపే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ..
సీఎం రిలీఫ్ ఫండ్ పథకం ద్వారా చంద్రయాన్గూడ గ్రామానికి చెందిన యాదయ్యకు రూ. 49వేలు, శ్రావణ్కు రూ. 12వేల చెక్కును ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, ఎంపీపీ ప్రియాంకగౌడ్, నందిగామ సర్పంచ్ వెంకట్రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నారాయణరెడ్డి, మాజీ ఎంపీపీ శివశంకర్గౌడ్, ఉపసర్పంచ్ కుమార్గౌడ్, వార్డు సభ్యులు, వ్యవసాయ శాఖ అధికారులు రాజరత్నం, శ్వేత, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.