తాండూరు రూరల్ : కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కరణ్కోట పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై మధుసూదన్రెడ్డి తెలిపిన వివరాలు.. తాండూరు మండలం, సంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన జనముల రాములు(47) కుటుంబ ఆర్థిక పరిస్థితులతో పాటు కుటుంబ కలహల కారణంగా ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంట్లోని దూలానికి నైలాన్తాడుతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.